AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కైలాస మానస సరోవర్ యాత్రకు వెళతారా..? అప్లై చేయడానికి చివరి తేదీ ఇదే!

Kailash Mansarovar Yatra 2026: కైలాస మానస సరోవర యాత్ర 2026 జూన్‌లో ప్రారంభమవుతుంది. భక్తుల కోసం మే 19 వరకు రిజిస్ట్రేషన్లు చేపట్టనున్నారు. ఈసారి యాత్రను మెరుగైన పర్యవేక్షణతో, క్రమబద్ధమైన బ్యాచ్‌లుగా నిర్వహించి మరింత సులభంగా, సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు.

కైలాస మానస సరోవర్ యాత్రకు వెళతారా..? అప్లై చేయడానికి చివరి తేదీ ఇదే!
Kailash Mansarovar Yatra 2026
Rajashekher G
|

Updated on: May 07, 2026 | 4:08 PM

Share

ఈ ఏడాది వార్షిక కైలాస్ మానసరోవర్ యాత్ర జూన్ నుంచి ఆగస్టు వరకు నిర్వహించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ఈ యాత్రకు దరఖాస్తులను 2026 మే 19 లోగా సమర్పించవచ్చని తెలిపింది. అధికారిక ప్రకటన ప్రకారం, యాత్రను ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్, సిక్కింలోని నాథూ లా మార్గాల ద్వారా నిర్వహించనున్నారు. మొత్తం 20 బ్యాచ్‌లుగా యాత్రను ప్లాన్ చేయగా, మొదటి 10 బ్యాచ్‌లలో ఒక్కో బ్యాచ్‌లో 50 మంది యాత్రికులకు అవకాశం కల్పించనున్నారు. ఈ కార్యక్రమం చైనా అధికారుల సమన్వయంతో కొనసాగుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

రిజిస్ట్రేషన్ వివరాలు

కైలాస్ మానసరోవర్ యాత్రకు దరఖాస్తులు కేవలం ఆన్‌లైన్ ద్వారానే స్వీకరించబడతాయి. అధికారిక వెబ్‌సైట్ kmy.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఫ్యాక్స్ లేదా భౌతిక లేఖల ద్వారా దరఖాస్తులు పంపాల్సిన అవసరం లేదని, మొత్తం ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత, యాదృచ్ఛిక, నిష్పక్షపాతంగా, లింగ సమతుల్యతను పరిగణలోకి తీసుకుని నిర్వహించబడుతుంది. దరఖాస్తుదారులు రెండు మార్గాల్లోనూ లేదా తమకు ఇష్టమైన ఒక్క మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు.

ప్రాముఖ్యత

కైలాస్ మానస సరోవర్ యాత్ర హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలలో ఒకటిగా పరిగణించబడుతుంది. శివుని నివాసంగా భావించే ఈ ప్రాంతం బౌద్ధులు, జైనులు సహా అనేకమందిని ఆకర్షిస్తుంది.

కోవిడ్-19 మహమ్మారి, భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఐదేళ్లకు పైగా నిలిచిపోయిన ఈ యాత్ర గత ఏడాది తిరిగి ప్రారంభమైంది.

ఖర్చు వివరాలు

హెలికాప్టర్ ద్వారా కాఠ్మండు–కాఠ్మండు 11 రోజుల యాత్రకు భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నవారికి సుమారు రూ. 3,45,000 ఖర్చవుతుంది. విదేశీ పాస్‌పోర్ట్ ఉన్నవారికి సరైన వీసాతో పాటు సుమారు $4,170 ఖర్చు అవుతుంది. రోడ్డు మార్గం సహా ఇతర ప్యాకేజీల వివరాలు కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Follow Us
హిట్ మ్యాన్ రికార్డు బద్ధలు.. ధోనీ రికార్డుపై కన్నేసిన అభిషేక్
హిట్ మ్యాన్ రికార్డు బద్ధలు.. ధోనీ రికార్డుపై కన్నేసిన అభిషేక్
కైలాస మానస సరోవర్ యాత్రకు వెళతారా..? అప్లై చేయడానికి చివరి తేదీ..
కైలాస మానస సరోవర్ యాత్రకు వెళతారా..? అప్లై చేయడానికి చివరి తేదీ..
టాలీవుడ్‌లో తిరుగులేని నటుడు.. ఆయన భార్య కూడా
టాలీవుడ్‌లో తిరుగులేని నటుడు.. ఆయన భార్య కూడా
2 రోజుల్లోనే EAPCET ఇంజనీరింగ్ పరీక్షలు.. ఒక్క నిమిషం నిబంధన అమలు
2 రోజుల్లోనే EAPCET ఇంజనీరింగ్ పరీక్షలు.. ఒక్క నిమిషం నిబంధన అమలు
ఇంతకీ.. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ..?
ఇంతకీ.. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ..?
భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టే కూరగాయ మొక్కలు ఇవేనా?
భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టే కూరగాయ మొక్కలు ఇవేనా?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా?
ఐపీఎల్‎లో అరుదైన రికార్డ్ సృష్టించబోతున్న స్వింగ్ కింగ్
ఐపీఎల్‎లో అరుదైన రికార్డ్ సృష్టించబోతున్న స్వింగ్ కింగ్
సింగరకొండ ఆంజనేయుడు.. గుమ్మం దగ్గరే 99 అడుగుల మహావిగ్రహం! వాహన...
సింగరకొండ ఆంజనేయుడు.. గుమ్మం దగ్గరే 99 అడుగుల మహావిగ్రహం! వాహన...
మల్లెచెట్టు చిన్నదైనా కొమ్మకొమ్మకి విపరీతంగా పూలు పూయాలంటే
మల్లెచెట్టు చిన్నదైనా కొమ్మకొమ్మకి విపరీతంగా పూలు పూయాలంటే