
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని సంతుష్టిపరచడం వల్ల ఇంట్లో శాంతి, సంపద, ధనం అధికమవుతాయి. అయితే ఈ అనుగ్రహాన్ని పొందాలంటే ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను ముందుగా తొలగించాలి. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంటిలో ఉంటే అవి నెగెటివ్ ఎనర్జీకి కారణమవుతాయి. అటువంటి వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఆ స్థలానికి రాకపోవచ్చు. ఇప్పుడు అటువంటి వస్తువులేంటో తెలుసుకుందాం.
చీపురు అనేది శుభ్రతకు ప్రాతినిధ్యం వహించే వస్తువు. కానీ ఇది పాడైపోయి, పగిలి, ముక్కలైపోయిన స్థితిలో ఉంటే ఇంట్లో దరిద్రాన్ని తెచ్చిపెడుతుందని నమ్మకం. అలాంటి చీపురును ఇంటిలో ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. కనుక అక్షయ తృతీయ రాకముందే పాడైన చీపురును తీసేసి కొత్తదానిని ఇంటికి తీసుకురావడం మంచిది.
ఇంట్లో చినిగిపోయిన, మురికిపట్టిన, పాడైపోయిన, చాలా రోజులుగా శుభ్రం చేయని బట్టలు ఉంటే.. అవి ఇంటికి చెడు శక్తిని ఆకర్షించవచ్చని నమ్మకం ఉంది. దరిద్రం పెరగడానికి కారణమవుతాయి. అలాంటి బట్టలను వెంటనే తొలగించాలి లేదా శుభ్రంగా ఉతికి పునరుపయోగించాలి. ఇది సంపద వచ్చే దారిని ఏర్పరుస్తుంది.
ఇంట్లో పని చేయని గడియారాలు, పాడైపోయిన పాత్రలు, పగిలిన అద్దాలు, పాడైపోయిన డెకరేషన్ వస్తువులు ఉంటే.. అవి ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పెంచుతాయి. వాస్తు ప్రకారం పగిలిన వస్తువులు ధనసంపద నిలకడకు ఆటంకంగా మారుతాయి. అలాంటి వాటిని తొలగించడం ద్వారా శుభ శక్తులు ప్రవేశిస్తాయని నమ్మకం ఉంది.
ఇంట్లో పూజా మందిరంలో ఉన్న విగ్రహాలలో ఏదైనా పగిలినది లేదా విరిగినదైతే.. అది దేవతకు అవమానంగా పరిగణించబడుతుంది. అటువంటి విగ్రహాలను ఇంటిలో ఉంచడం వల్ల ఆ శక్తి క్షీణిస్తుంది. అవి పవిత్రమైన నీటిలో.. అంటే నది లేదా చెరువులో నిమజ్జనం చేయాలి. ఇంటిలో సంపూర్ణ, శుభ్రమైన విగ్రహాలే ఉండాలి.
లక్ష్మీదేవి శుభ్రమైన, పరిశుభ్ర వాతావరణాన్ని ఇష్టపడుతారు. ఇంటిలో ఉన్న చెత్త, మూలలో పేరుకుపోయిన ధూళి, పాడైన వస్తువులు వంటి వాటిని తొలగించకపోతే అవి వాస్తు దోషాలకు కారణమవుతాయి. అలాంటి వాటిని తొలగించడం ద్వారా ఇంటిలో శుభత, శాంతి, ఆనందం నెలకొంటాయి.