AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morning vs Night Bath: పగలా..? రాత్రా..? ఏ టైంలో స్నానం చేస్తే ఆరోగ్యానికి మేలు..

మంచి ఆరోగ్యానికి స్నానం చాలా అవసరం. స్నానం శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా మనసును కూడా ప్రశాంతపరుస్తుంది. కానీ చాలా మంది ఉదయం స్నానం చేస్తారు. మరి కొంతమంది రాత్రిపూట స్నానం చేస్తారు. భారతీయులుగా మనం ఎక్కువగా ఉదయం స్నానం చేయడానికి ఇష్టపడతాం. కానీ చైనా, జపాన్, కొరియా వంటి దేశాల్లో..

Morning vs Night Bath: పగలా..? రాత్రా..? ఏ టైంలో స్నానం చేస్తే ఆరోగ్యానికి మేలు..
Morning Vs Night Bath
Follow us
Srilakshmi C

|

Updated on: May 07, 2025 | 9:01 PM

ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ స్నానం చేసే అలవాటు ఉంటుంది. మంచి ఆరోగ్యానికి స్నానం చాలా అవసరం. స్నానం శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా మనసును కూడా ప్రశాంతపరుస్తుంది. కానీ చాలా మంది ఉదయం స్నానం చేస్తారు. మరి కొంతమంది రాత్రిపూట స్నానం చేస్తారు. భారతీయులుగా మనం ఎక్కువగా ఉదయం స్నానం చేయడానికి ఇష్టపడతాం. కానీ చైనా, జపాన్, కొరియా వంటి దేశాల్లో రాత్రిపూట స్నానాలు చేసే అలవాటు ఉంది. కానీ ఈ రెండింటిలో ఏది మంచిదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

సాధారణంగా చాలా మంది సాయంత్రం లేదా రాత్రి పూట స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల రోజులో శరీరంపై పేరుకుపోయిన టాక్సిన్స్, మురికి పూర్తిగా తొలగిపోతాయి. అలాగే, వారికి రాత్రిపూట విశ్రాంతి అవసరం కాబట్టి, బాగా నిద్రపోవడానికి ఇలా చేస్తారు. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు. ముఖ్యంగా చైనా వంటి దేశం.. తేమతో కూడిన, ఉష్ణమండల ప్రాంతం. కాబట్టి ఇక్కడి ప్రజలకు ఎక్కువగా చెమట పడుతుంది. అందుకే వారు రాత్రిపూట స్నానాలు చేయడానికి ఇష్టపడతారు. రాత్రిపూట స్నానం చేయడం మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు. రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత స్నానం చేయడం వల్ల అలసట తగ్గి బాగా నిద్రపోతుందట.

ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు చేయకూడదు?

చాలా మంది ఉదయం,రాత్రి స్నానం చేస్తారు. ఆయుర్వేదంలో మాత్రం ఉదయం సూర్యోదయానికి ముందు, సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయడం ఉత్తమమని చెబుతుంది. అలాగే ఆయుర్వేదం ప్రకారం మధ్యాహ్నం స్నానం చేయడం మంచిది కాదు. మధ్యాహ్నం స్నానం చేయడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. ఇది మయోసైటిస్ అనే వాపుకు సంబంధించిన వ్యాధిని కలిగిస్తుందట. మధ్యాహ్నం స్నానం చేయడం వల్ల వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, కంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

తిన్న తర్వాత కూడా స్నానం చేయకూడదని నిపుణులు అంటున్నారు. భోజనం తర్వాత, ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి కడుపుకు ఎక్కువ శక్తి, సరైన శరీర ఉష్ణోగ్రత అవసరం. అంతేకాకుండా, ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి తిన్న తర్వాత స్నానం చేయడం మంచిది కాదు. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే నిపుణులు తిన్న గంట తర్వాత లేదా గంటన్నర తర్వాత మాత్రమే స్నానం చేయాలని అంటున్నారు.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.