Diabetes: గ్లాస్‌ వేడి పాలల్లో ఇది చిటికెడు కలిపి తాగితే జన్మలో షుగర్‌ వ్యాధి రాదు..

వయసుతో సంబంధంలేకుండా మధుమేహం వ్యాధి భారీన పడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రక్తంలో చక్కెర పెరగడం వల్ల తలెత్తే ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే ఆజన్మాంతం వెంటాడుతుంది..

Diabetes: గ్లాస్‌ వేడి పాలల్లో ఇది చిటికెడు కలిపి తాగితే జన్మలో షుగర్‌ వ్యాధి రాదు..
Diabetes
Follow us

|

Updated on: Feb 10, 2023 | 12:35 PM

వయసుతో సంబంధంలేకుండా మధుమేహం వ్యాధి భారీన పడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రక్తంలో చక్కెర పెరగడం వల్ల తలెత్తే ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే ఆజన్మాంతం వెంటాడుతుంది. రక్తంలో చక్కెర స్థాయులను పంచే ఆహారాలను తెలిసో.. తెలియకో.. తినేస్తుంటాం. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం మాత్రమేకాకుండా అనేక అనారోగ్య సమస్యలకు ప్రత్యక్ష కారణం అవుతుంది. ముఖ్యంగా చలికాలంలో చాలా మంది బద్దకించి వ్యాయామం చేయడం మానేస్తుంటారు. శారీరక శ్రమ తగ్గడంతో జీవక్రియ నెమ్మదిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయి మరింత ప్రభావితమవుతుంది. ఐతే కొన్ని రకాల సహజ మూలికలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ఈ పొడులను గ్లాసుడు పాలల్లో కలిపి తాగితే బ్లడ్ షుగర్ లెవెల్‌ను నియంత్రణలో ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ధనియాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నియంత్రిస్తాయి. దీనిలోని కార్భోహైడ్రేట్ జీవక్రియను మెరుగుపర్చడానికి, హైపోగ్లైసీమిక్ చర్యను పెంచడానికి సహాయపడతాయి. ధనియాలలో ఇథనాల్ పుష్కలంగా ఉంటుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి సహాయడుతుంది.  అలాగే గ్లాసుడు వేడి పాలల్లో దాల్చిన చెక్క పొడిని చిటికెడు కలిపి తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ 18 నుంచి 29 శాతం తగ్గుతుంది.

నీళ్లలో నానబెట్టిన 10 గ్రాముల మెంతులను క్రమం తప్పకుండా తీసుకోవడం టైప్ 2 డయాబెటీస్ నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేదా నిద్రపోయే ముందు మెంతులు నానబెట్టిన నీటిని తాగడం వల్ల టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.