Cancer: రాత్రి 9 తర్వాత ఆహారం తింటున్నారా.. క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందంటూ హెచ్చరిక..

రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆంకాలజిస్ట్ డాక్టర్ అనురాగ్ కుమార్ చెబుతున్నారు. దీనివల్ల పేగుల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. క్రమంగా ఈ ఇన్ఫెక్షన్ పెరిగి పేగుల్లో క్యాన్సర్ వస్తుంది. అంతే కాకుండా రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కనుక రాత్రి 9 గంటలకు ముందు రాత్రి భోజనం చేయడానికి ప్రయత్నించండి.

Cancer: రాత్రి 9 తర్వాత ఆహారం తింటున్నారా.. క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందంటూ హెచ్చరిక..
Health Tips
Follow us

|

Updated on: Aug 04, 2023 | 10:23 AM

క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి బారిన పడి ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. నేటికీ ఈ వ్యాధికి మందు లేదా వ్యాక్సిన్ లేదు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. అయితే తినే ఆహారపు అలవాట్లు కూడా క్యాన్సర్ వ్యాధి కారకమని అని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా రాత్రి పూట భోజనం చేసే అలవాటు వారు ఎక్కువగా క్యాన్సర్‌ బారిన పడుతున్నారని మీకు తెలుసా. బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ నివేదిక ప్రకారం రాత్రి భోజనం, నిద్ర మధ్య దాదాపు రెండు గంటల గ్యాప్ ఉండాలి. ఇలాంటి గ్యాప్ లేకుండా తినడం, నిద్ర పోవడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మానవ శరీరం జీవ గడియారం సమతుల్యత క్షీణించడం వల్ల ఇది జరుగుతుంది. రాత్రి 9 గంటల తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువ.

జర్నల్ ఆఫ్ క్యాన్సర్ నివేదిక కూడా రాత్రిపూట ఆలస్యంగా తినడం ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్‌కు కారణమవుతుందని పేర్కొంది. రాత్రి భోజనం 9 గంటలకు ముందే తినాలని ఈ నివేదికలో పేర్కొన్నారు. దీని తర్వాత తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20 రెట్లు పెరుగుతుంది. రాత్రిపూట మద్యం సేవించే లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినే వ్యక్తుల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువ. కేన్సర్‌తో పాటు అనేక వ్యాధులకు రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు కూడా కారణమని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల పొట్టకు సంబంధించిన వ్యాధులు, పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

అర్థరాత్రి తినడం వల్ల క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే?

రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆంకాలజిస్ట్ డాక్టర్ అనురాగ్ కుమార్ చెబుతున్నారు. దీనివల్ల పేగుల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. క్రమంగా ఈ ఇన్ఫెక్షన్ పెరిగి పేగుల్లో క్యాన్సర్ వస్తుంది. అంతే కాకుండా రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కనుక రాత్రి 9 గంటలకు ముందు రాత్రి భోజనం చేయడానికి ప్రయత్నించండి.

ఇవి కూడా చదవండి

జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతోంది

ప్రస్తుతం జంక్ ఫుడ్ తినే అలవాటు ప్రజల్లో చాలా ఎక్కువగా ఉంది. మధ్యాహ్న భోజనంలో ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. పిల్లలు, యువత, పెద్దలు అనే తేడా లేదు.. ఎక్కువగా జంక్ ఫుడ్‌పైనే ఆధారపడుతున్నారు. అయితే ఈ ఫుడ్ క్యాన్సర్ కారకం అని హెచ్చరిస్తున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం ఫాస్ట్ ఫుడ్‌లో హైడ్రోజన్ కొవ్వు , కృత్రిమ స్వీటెనర్ వాడతారు. అవి శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ కణాలను పెంచుతాయి. దీని వల్ల కడుపు పేగుల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంతకు ముందు అమెరికా లాంటి దేశాల్లో ఈ క్యాన్సర్ కేసులు నమోదయ్యేవి.. అయితే ఇప్పుడు భారత దేశంలో కూడా పేగు క్యాన్సర్ కేసులు ఏటా పెరుగుతున్నాయి. దీనికి కారణం ఫాస్ట్ ఫుడ్ అని తెలుస్తోంది.

ఫాస్ట్ ఫుడ్ లో రసాయనాలు

ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ వస్తుందని ధర్మశిల ఆస్పత్రికి చెందిన క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అన్షుమన్ కుమార్ వివరించారు. ఫాస్ట్ ఫుడ్ సులభంగా జీర్ణం కాదు. అనేక రకాల ప్యాక్ చేసిన ఆహారాన్ని తాజాగా ఉంచేందుకు రసాయనాలు కలుపుతారు. ఈ రసాయనం ఆహారం తీసుకునే సమయంలో శరీరంలోకి ప్రవేశించి ప్రేగుల పనితీరును ప్రభావితం చేస్తుంది. దీని వల్ల చాలా కాలంగా కడుపులో ఉన్న సమస్య పెరిగి క్రమంగా క్యాన్సర్‌కు కారణమవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు