
దక్షిణ భారత వంటకాలలో కొబ్బరి పాలు వాడకం ఎక్కువ. కేరళ వంటకాలకు కొబ్బరి పాలు జీవనాడి లాంటివి. ఈ ముట్టా కర్రీలో కూడా కొబ్బరి పాలే ప్రధానం. ఇంట్లో సులభంగా తయారు చేసుకునే ఈ కూర వేడి వేడి అన్నం, ఆప్పం, ఇడియప్పం లేక గోధుమ పరోటాతో తింటే అద్భుతంగా ఉంటుంది.
ఉడికించిన గుడ్లు – 4 నుండి 6
తరిగిన ఉల్లిపాయలు – 2
తరిగిన టమాటా – 1
సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి – 1 చెంచా
చీల్చిన పచ్చిమిర్చి – 2
కరివేపాకు – 1 రెబ్బ
చిక్కని కొబ్బరి పాలు – 1 కప్పు
నీరు – ½ కప్పు
పసుపు పొడి – ¼ చెంచా
కారం పొడి – 1 చెంచా
ధనియాల పొడి – 1½ చెంచా
గరం మసాలా – ½ చెంచా
నల్ల మిరియాల పొడి – ¼ చెంచా
ఆవాలు – ½ చెంచా
కొబ్బరి నూనె – 2 చెంచాలు
ఉప్పు – సరిపడా
గుడ్లు ఉడికించి, పొట్టు తీసి, గుడ్లపై అక్కడక్కడ చిన్నగా గాట్లు పెట్టండి. ఇలా చేయడం వలన మసాలా గుడ్ల లోపలికి చేరుతుంది.
ఒక పాత్రలో కొబ్బరి నూనె వేడి చేయండి. నూనె వేడి ఐన తరువాత ఆవాలు వేసి చిటపటలాడించండి. ఆ తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.
ఇప్పుడు అల్లం, వెల్లుల్లి ముక్కలు, టమాటా ముక్కలు వేయండి. టమాటాలు మెత్తగా మారే వరకు బాగా ఉడికించండి.
పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపండి. ఈ మసాలా బాగా వేగిన తరువాత ఉడికించిన గుడ్లు వేయండి. మసాలాలు గుడ్లకు బాగా పట్టేలా మెల్లగా కలపండి.
చిక్కని కొబ్బరి పాలు, నీరు పోసి ఒకసారి కలపండి. దీనిని సుమారు 5 నిమిషాలు చిన్న మంటపై ఉడికించండి. గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలుతున్నప్పుడు గరం మసాలా వేసి బాగా కలిపి దించండి.
ఘుమఘుమలాడే ముట్టా కర్రీ సిద్ధం. దీనిని అన్నం లేక ఆప్పంతో కలిపి తింటే రుచి అద్భుతం.