చలికాలంలో మనకు ఏదైనా కొత్త వంటకాలు తినాలనిపిస్తుంది. రెగ్యులర్ గా చేసేవి కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయాలని ఇంట్లో వాళ్లను సతాయిస్తుంటాం. అలాగే శీతాకాలంలో ఎక్కువుగా ఆకుకూరలు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇంట్లో వాళ్లు ఆకు కూరలతో ఏదైనా వంట చేస్తే సింపుల్ పక్కన పెట్టెస్తుంటాం. అయితే టేస్టీ వంటకం ఆకు కూరతో చేస్తే..! తింటారు కదా.. అలాంటి వంటే ఆలూ పరోటా. ఆలూ పరోటాకే ఇంత బిల్డప్పా అంటే మరి అంతే మరి మెంతి కూరతో చేసే ఆలూ పరోటాకు మాత్రం జై కొట్టకుండా ఉండలేరు.
సాధారణంగా ఆలూ పరోటా అనేది ఉత్తరాది వంటకం. మైదా లేదా గోదుమ పిండిలో ఉడికించిన బంగాళదుంపలు కలిపి చపాతిలా చేసి పెనంపై కాలుస్తుంటారు. దీనికి ఏదైనా కూరను జత చేసి ఇంచక్కా లాగిస్తుంటారు. అయితే రెగ్యులర్ గా చేసే ఈ రెసిపీకి కొంచెం కొత్తదనాన్ని యాడ్ చేద్దాం. పరోటా అంటే సాధారణంగా మైదా లేదా గోధుమ పిండితో చేస్తారు. కానీ మేతి ఆలూపరోటాలో కొంచెం శెనగ పిండి కూడా కలపాలి. మనం దీన్ని సాయంత్రం సమయంలో స్నాక్ కింద తినొచ్చు. కొత్తగా ఉండే దీని తయారీ విధానం తెలుసుకుందాం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి