చాలా మంది నోటి శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. దీంతో వారు దంతాలు, నాలుక అన్ని విధాలుగా శుభ్రంగా ఉంచుకుంటారు. అయితే కొంత మంది ఉదయాన్నే పళ్లు తోముకోవడం, శుభ్రంగా ఉంచుకోవడం వంటి పనులు తీవ్ర బద్దకాన్ని కలిగిస్తాయి. ఒక్కోసారి బ్రషింగ్ కూడా చేయరు. కానీ బ్రషింగ్ను ఒకటి లేదా రెండు రోజులు చేయకపోయినా పెద్దగా సమస్య ఉండదు. కానీ ఇలా నెల రోజులపాటు నిర్లక్ష్యం చేయడం వలన శరీర మొత్తం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. నిజానికి, నోట్లో మిలియన్ల బ్యాక్టీరియా ఉంటుంది. దంతాలను క్రమం తప్పకుండా బ్రష్ చేయకపోతే, బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. ఇది నోటి దుర్వాసనతో మొదలై అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది.
నోటి ఆరోగ్యం, గుండె జబ్బుల మధ్య లింక్ ఉంటుంది. చిగుళ్ల వాపు వల్ల విషాన్ని విడుదల చేస్తుంది. ఈ విషపదార్ధాలు రక్తప్రవాహం ద్వారా గుండెకు చేరుకుంటాయి. ఇక్కడ అవి ఎండోకార్డిటిస్, ధమనులకు అద్డుపటం జరిగి, స్ట్రోక్కు కారణమవుతాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్ను సమర్థవంతంగా ఉపయోగించే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఒకదానికొకటి విష చక్రాన్ని సృష్టిస్తుంది. కాబట్టి నోటి పరిశుభ్రతను నిర్వహించడం ద్వారా ఈ చక్రాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు.
నోటిలోని చెడు బ్యాక్టీరియాను పీల్చడం వల్ల అనేక శ్వాసకోశ వ్యాధులు తీవ్రతరం అవుతాయి. పేలవమైన దంతాల ఆరోగ్యం అబార్షన్, తక్కువ బరువుకు దారి తీస్తుంది.
దంతాలను క్రమం తప్పకుండా బ్రష్ చేయకపోవడం తీవ్రమైన దీర్ఘకాలిక ప్రమాదాలకు దారితీస్తుంది. చిగురువాపు, చిగుళ్ల వ్యాధి అనేది ప్రారంభ దశ, ఇది పీరియాంటైటిస్గా అభివృద్ధి చెందుతుంది. దీంతో చిగుళ్లు చనిపోయి, దంతాల మూలాలు బయటకు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇది గణనీయమైన ఎముక నష్టానికి దారి తీస్తుంది. దంతాలు వదులుగా మారి ఊడిపోయే ప్రమాదం కూడా ఉంది. దీర్ఘకాలిక పీరియాంటైటిస్ అనేది గుండె సమస్యలు, మధుమేహం, ఆర్థరైటిస్, గర్భధారణ సమయంలో వచ్చే సమస్యల వంటి దైహిక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది.