Boiled Groundnuts: ఉడకబెట్టిన వేరుశనగ తింటే.. ఈ సమస్యలన్నింటికీ బైబై చెప్పొచ్చు..
వేరు శనగ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి తెలుసు. జీడిపప్పులో ఎలాంటి పోషకాలు లభిస్తాయో.. వేరు శనగలో కూడా అలాంటి పోషకాలే లభిస్తాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. పలు రకాల వంటకాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పల్లీలు ఉపయోగించడం వల్ల వంటకాల రుచి కూడా పెరుగుతుంది. వేరు శనగ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చాలా మంది స్నాక్స్గా వీటిని..
వేరు శనగ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి తెలుసు. జీడిపప్పులో ఎలాంటి పోషకాలు లభిస్తాయో.. వేరు శనగలో కూడా అలాంటి పోషకాలే లభిస్తాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. పలు రకాల వంటకాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పల్లీలు ఉపయోగించడం వల్ల వంటకాల రుచి కూడా పెరుగుతుంది. వేరు శనగ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చాలా మంది స్నాక్స్గా వీటిని తీసుకుంటూ ఉంటారు. కొంత మంది వేయించుకుని తింటే.. మరొకరు ఇతర పదార్థాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వేరుశనగను ఉడకబెట్టి తినడం వల్ల ఆరోగ్యానికి మరింత మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యాంటీ ఆక్సిడెంట్లు మెండు:
ఉడకబెట్టిన వేరు శనగలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల చర్మానికి, జుట్టుకు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను కూడా తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటే ఆహారాలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
మెదడు ఆరోగ్యం:
వేరు శనగ తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగు పడుతుంది. బ్రెయిన్ హెల్త్కు చాలా మంచిది. ఉడకబెట్టిన పల్లీలు తింటే.. మెదడు పనితీరు మెరుగు పడి.. యాక్టీవ్ అవుతుంది. అంతే కాకుండా మతిమరుపు సమస్యను తగ్గించి.. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పిల్లలకు ఇస్తే వారి బ్రెయిన్ ఎదుగుదలకు చక్కగా సహాయ పడుతుంది.
బరువు నియంత్రణ:
ఉడకబెట్టిన పల్లీలు తినడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే వీటిల్లో కేలరీలు తక్కువగా, ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా లభిస్తాయి. కొద్దిగా తీసుకున్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఇతర ఆహారాలు తీసుకోలేరు. కాబట్టి.. వెయిట్ లాస్ అయ్యేందుకు ఇది బెస్ట్ ఫుడ్.
బ్లడ్ షుగర్ కంట్రోల్:
ఉడక బెట్టిన పల్లీలు తినడం వల్ల బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే ప్రోటీన్, ఫైబర్ మెండుగా, తక్కువ క్యాలరీలు లభిస్తాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఉడకబెట్టిన పల్లీలు తినడం బెటర్.
NOTE: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..