రాత్రిపూట నీళ్లలో నానబెట్టిన ఎండుద్రాక్ష..ఉదయాన్నే తీసుకుంటే కలిగే బెనిఫిట్స్ ఇవే..

నానబెట్టిన ఎండు ద్రాక్ష నీళ్లు తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పొటాషియం రక్తపోటును నియంత్రించగా, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడి క్యాన్సర్‌ను నివారిస్తాయి. ఫైబర్ బరువు తగ్గడానికి, జీర్ణక్రియ మెరుగుపడటానికి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి, లివర్ సమస్యలను తగ్గిస్తుంది. రక్తహీనతను నివారించి, ఐరన్ స్థాయిలను పెంచుతుంది.

రాత్రిపూట నీళ్లలో నానబెట్టిన ఎండుద్రాక్ష..ఉదయాన్నే తీసుకుంటే కలిగే బెనిఫిట్స్ ఇవే..
Raisin Water

Updated on: Jan 05, 2026 | 2:46 PM

ఎండు ద్రాక్షలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందుకే నీళ్లలో ఎండు ద్రాక్షను నానబెట్టిన తర్వాత వాటిని తాగితే మీ రక్తపోటు కంట్రోల్ అవుతుంది. కిస్మిస్ నానబెట్టిన నీళ్లను తాగితే మీ గుండెకు కూడా చాలా మంచిది. . ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడుతాయి. కిస్మస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరాన్ని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతాయి.

కిస్మిస్ పండ్ల లో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నీళ్లను తాగినట్లయితే ఇమ్యూనిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎవరైతే లివర్ సమస్యతో బాధపడుతున్నారో వారు ఉదయం లేవగానే కిస్మిస్ నానబెట్టిన నీళ్లను తాగితే చాలా మంచిది. కిస్మిస్ పండ్లను నానబెట్టిన నీళ్లను తాగితే కడుపులో గ్యాస్ తగ్గుతుంది.

ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో అలాంటివారు కిస్మిస్ పండ్లను తినడంతో పాటు కిస్మిస్ నానబెట్టిన నీళ్లను తాగితే వారి శరీరంలో ఐరన్ నిలువలు పెరుగుతాయి. కిస్మిస్ పండ్లను తింటే మలబద్ధకం కూడా తొలగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..