
నేటి మహిళలు ఇంటి పనులతో పాటు ఆఫీస్ బాధ్యతలతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. నిరంతర పనిభారం, నిద్ర లేమి, హార్మోన్ల మార్పులు, తమకోసం సమయం దొరకకపోవడం వంటివి ఆందోళన, నిరాశకు దారి తీస్తున్నాయి. ఈ సమస్యలకు యోగా ఒక సహజ నివారణ మార్గం అని యోగా గురువు స్వామి రాందేవ్ సూచిస్తున్నారు. యోగా ఆసనాలు శరీరాన్ని, మనస్సును సమతుల్యం చేసి, ఆక్సిజన్ స్థాయిలను పెంచుతాయి. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల చిరాకు తగ్గి, మానసికంగా బలంగా మారుతారు. అదనంగా ధ్యానం, ప్రాణాయామం ఫోకస్, శాంతిని పెంచుతాయి. మానసిక డిటాక్సిఫైకి యోగా అత్యంత ప్రభావవంతమైన పద్ధతి అని బాబా రాందేవ్ చెప్పారు. యోగాకు ప్రతిరోజూ కొంత సమయం కేటాయించే మహిళలు మానసికంగా బలంగా ఉంటారు.
మహిళలు తమ ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి తప్పనిసరిగా సాధన చేయాల్సిన 5 యోగాసనాలు, వాటి ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:
దీన్ని వెంటనే ప్రశాంతతనిచ్చే ఆసనంగా చెబుతారు. ఇది తల, వెన్నెముకపై ఉండే ఒత్తిడిని, ఉద్రిక్తతను తగ్గిస్తుంది. మీరు అలసటగా ఉన్నప్పుడు ఈ ఆసనం వేస్తే గాఢ నిద్రను ప్రోత్సహిస్తుంది. త్వరగా విశ్రాంతి లభిస్తుంది.
ఈ ఆసనం అలసట నుండి ఉపశమనం కలిగించి శరీరంలో రక్త ప్రసరణను బాగా మెరుగుపరుస్తుంది. ఇది ఆందోళన, తలనొప్పి, ఒత్తిడిని తగ్గించి, మనస్సు తేలికపడిన అనుభూతిని ఇస్తుంది.
ఈ ఆసనం వేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత మెరుగుపడుతుంది. ఇది మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు, చిరాకును తగ్గిస్తుంది. అలాగే శరీరంలో శక్తిని పెంచి, వెన్నెముక కండరాలను బలంగా చేస్తుంది.
శవాసన అంటే శవంలా పడుకోవడం. దీనిని మానసిక ప్రశాంతత కల్పించే ఆసనం అని పిలుస్తారు. ఇది మనస్సు, శరీరం రెండింటికీ పూర్తి విశ్రాంతిని ఇస్తుంది. ప్రతికూల ఆలోచనలను శాంతపరచి, ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది.
ఈ ఆసనం సాధన చేయడం ద్వారా ఏకాగ్రత, ఎమోషనల్ స్టెబిలిటీ మెరుగుపడుతుంది. ఇది మనస్సును పూర్తిగా ప్రశాంతపరిచి, మానసిక స్పష్టతను పెంచుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..