AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్‌, మటన్‌ తిన్న తర్వాత ఈ ఆహారాలు అస్సలు తినొద్దు! ఒంట్లో విషంగా మారతాయ్

చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహార వంటకాలు ఎంతో మందికి ఇష్టమైనవి. ముఖ్యంగా వారాంతాల్లో లేదా ప్రత్యేక సందర్భాల్లో మాంసాహారం తప్పనిసరిగా తీసుకునే వారు చాలా మంది ఉంటారు. మాంసాహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది..

చికెన్‌, మటన్‌ తిన్న తర్వాత ఈ ఆహారాలు అస్సలు తినొద్దు! ఒంట్లో విషంగా మారతాయ్
Non Vegetarian Food Combinations
Srilakshmi C
|

Updated on: Jun 23, 2026 | 6:00 AM

Share

మాంసాహారం తిన్న తర్వాత తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మాంసాహారం జీర్ణం కావడానికి సాధారణంగా ఎక్కువ సమయం పడుతుంది. అలాంటి సమయంలో కొన్ని ఆహారాలను వెంటనే తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే మాంసాహారం తిన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.

చల్లటి నీరు, ఐస్‌క్రీమ్‌కు దూరంగా ఉండాలి

చికెన్ లేదా మటన్ తిన్న వెంటనే చల్లటి నీరు తాగడం లేదా ఐస్‌క్రీమ్ తినడం చాలా మంది అలవాటు. అయితే ఇది జీర్ణక్రియ ప్రక్రియను తాత్కాలికంగా మందగింపజేస్తుంది. దీంతో కడుపులో అసౌకర్యం, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

సిట్రస్ పండ్లు వెంటనే తినొద్దు

నిమ్మకాయ, నారింజ, ముసంబి వంటి సిట్రస్ పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. కానీ మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండింటిని ఒకేసారి లేదా వెంట వెంటనే తీసుకోవడం వల్ల కొందరిలో గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు కనిపించవచ్చు.

ఇవి కూడా చదవండి

పాలు, పెరుగు తీసుకోవడంలో జాగ్రత్త

మాంసాహారం తిన్న వెంటనే పాలు, పెరుగు, మజ్జిగ లేదా ఇతర పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. మాంసాహారం మరియు పాల ఉత్పత్తుల జీర్ణక్రియ విధానం భిన్నంగా ఉండటంతో అజీర్ణం, గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు.

టీ, కాఫీ వెంటనే తాగకండి

భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం వల్ల అందులో ఉండే టానిన్లు శరీరం ఇనుమును గ్రహించే సామర్థ్యాన్ని తగ్గించవచ్చు. ముఖ్యంగా మాంసాహారంలో లభించే ఐరన్ శరీరానికి పూర్తిగా అందకపోవచ్చు.

డెజర్ట్‌లను వెంటనే తీసుకోవద్దు

మాంసాహారం తిన్న వెంటనే స్వీట్లు, డెజర్ట్‌లు తీసుకోవడం కూడా జీర్ణక్రియను మరింత నెమ్మదింపజేస్తుంది. దీంతో గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

అధిక కార్బోహైడ్రేట్లతో కలిపి తినడం మంచిది కాదు

బంగాళాదుంపలు, పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలను కొవ్వు ఎక్కువగా ఉండే మాంసాహార వంటకాలతో కలిసి అధిక పరిమాణంలో తీసుకుంటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల అలసట, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు.

ఆరోగ్యంగా ఉండాలంటే…

మాంసాహారం తీసుకున్న తర్వాత తగినంత నీరు తాగడం, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే జీర్ణక్రియకు అనుకూలంగా ఉండే ఆహారాలను సరైన సమయంలో తీసుకుంటే ఆరోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులు, జీర్ణశక్తి, ఆహార అలవాట్లు భిన్నంగా ఉంటాయి. తరచూ జీర్ణ సమస్యలు ఎదురైతే వైద్యుడు లేదా పోషకాహార నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.

Follow Us