
తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప బహుమతులలో ఒకటి ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది జీవితంలో ఎన్నో కష్టసుఖాలను ఎదుర్కోవడానికి వారికి ధైర్యాన్నిస్తుంది. పిల్లలకు కొన్ని పవిత్రమైన మంత్రాలను నేర్పించడం వల్ల వారికి భక్తితో పాటు.. మంచి లక్షణాలు, దయ, కృతజ్ఞత లాంటివి అలవాటవుతాయి. అందుకే ప్రతి చిన్నారి తప్పకుండా నేర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన మంత్రాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మంత్రం శివుడికి చెందింది. శివుడు ఈ సృష్టికి మూలం, అంతం కూడా ఆయనే. ఈ మంత్రం జపించడం చాలా సులభం. ఓం నమః శివాయ మంత్రం అంటే భగవాన్ శివుడికి నా నమస్కారాలు అని అర్థం. ఈ మంత్రంలో ఉన్న ఐదు అక్షరాలు న, మ, శి, వా, య, పంచభూతాలను (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) సూచిస్తాయి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మన జీవితంలో మంచి మార్పులు వస్తాయి. శివుడి రక్షణ లభిస్తుంది.
ఈ మంత్రం విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడికి చెందుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే భగవాన్ వాసుదేవుడికి నా నమస్కారాలు అని అర్ధం. ఈ మంత్రం జపించడం వల్ల పిల్లల్లో విశ్వాసం, భక్తి పెరుగుతాయి.
ఈ మంత్రం విఘ్నాలను తొలగించే గణపతి దేవుడిది. దీనిని జపించడం వల్ల శాంతి, సంతోషం లభిస్తాయి. పిల్లలు ఏదైనా కొత్త పని మొదలుపెట్టే ముందు ఈ మంత్రం చదవడం వల్ల వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఇది వారి మనసులో ఉన్న భయాన్ని దూరం చేస్తుంది.
శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారాలలో ఒకరు. ఈ మంత్రం శ్రీరాముడికి అంకితం చేయబడింది. ఈ మంత్రం జపించడం వల్ల పిల్లలు నిజాయితీ, దయ, న్యాయం లాంటి మంచి విలువలను నేర్చుకుంటారు. దీని వల్ల వారి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది.
ఈ మంత్రం పరమాత్ముడైన నారాయణుడికి చెందుతుంది. ఓం నమో నారాయణాయ అంటే పరమేశ్వరుడికి నా నమస్కారాలు అని అర్ధం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. భక్తి పెరుగుతుంది. ముఖ్యంగా సాయంత్రం వేళ ఈ మంత్రాన్ని జపించడం చాలా మంచిది.