AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబుగారూ..! తేడా తెలుస్తుందా.?

ట్విట్టర్ అకౌంట్ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుపై తరచూ సెటైరు కురిపించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు కొత్త అంశాలతో ముందుకు వచ్చారు. రాజధాని నిర్మాణానికి ఫండ్స్, టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దుబారా గురించి ఎత్తుకున్నారు విజయసాయి. అవేంటో ఆయన మాటల్లోనే చూద్దాం.. “రాజధాని ఇటుకల కోసం స్కూలు పిల్లల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైంది బాబు గారూ? రియల్ ఎస్టేట్ భూముల విలువ పెంచుకునేందుకు పసివాళ్లని కూడా వదల్లేదు కదా. మీరు వాళ్ల […]

బాబుగారూ..!  తేడా తెలుస్తుందా.?
Vijayasai reddy
Venkata Narayana
|

Updated on: Oct 10, 2020 | 11:41 AM

Share

ట్విట్టర్ అకౌంట్ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుపై తరచూ సెటైరు కురిపించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు కొత్త అంశాలతో ముందుకు వచ్చారు. రాజధాని నిర్మాణానికి ఫండ్స్, టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దుబారా గురించి ఎత్తుకున్నారు విజయసాయి. అవేంటో ఆయన మాటల్లోనే చూద్దాం..

“రాజధాని ఇటుకల కోసం స్కూలు పిల్లల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైంది బాబు గారూ? రియల్ ఎస్టేట్ భూముల విలువ పెంచుకునేందుకు పసివాళ్లని కూడా వదల్లేదు కదా. మీరు వాళ్ల జేబులు ఖాళీ చేస్తే, ఇప్పుడా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు జగన్ గారు. తేడా తెలుస్తోందా?” అంటూ ఒక ట్విట్‌లో విమర్శించిన విజయసాయి మరో ట్వీట్ లో దుబారా గురించి ప్రస్తావించారు. “పోలవరం యాత్రలకు చంద్రబాబు చేసిన ఖర్చు 400 కోట్లు, దొంగ దీక్షలకు మరో 300 కోట్లు ఊదేశాడు. జగన్ గారు 43 లక్షల మంది విద్యార్థులకు బ్యాగు, నోట్ బుక్స్, టెస్ట్ బుక్స్, వర్క్ బుక్స్, బూట్లు, సాక్స్, బెల్ట్ తో కూడిన కిట్ ఇవ్వడానికి చేసిన ఖర్చు 650 కోట్లు. ఏది విజన్ ? ఏది దుబారా ?” అంటూ వైసీపీ ఎంపీ ప్రశ్నించారు.