AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివేకా హత్యపై సునీత సంచలన వ్యాఖ్యలు

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్యపై సాక్ష్యాలను సీఐ తారుమారు చేశారనే అనుమానం కలుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. హత్య జరిగి ఇన్ని రోజులైనా ఎలాంటి ఆధారాలు సేకరించలేదని సునీతా ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారా లేదా అని, సిట్ దర్యాప్తుపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని సునీత అన్నారు. ఇక హత్య జరిగిన రోజు బలవంతపెడితే తప్ప సీఐ […]

వివేకా హత్యపై సునీత సంచలన వ్యాఖ్యలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 25, 2019 | 9:12 AM

Share

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్యపై సాక్ష్యాలను సీఐ తారుమారు చేశారనే అనుమానం కలుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. హత్య జరిగి ఇన్ని రోజులైనా ఎలాంటి ఆధారాలు సేకరించలేదని సునీతా ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారా లేదా అని, సిట్ దర్యాప్తుపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని సునీత అన్నారు. ఇక హత్య జరిగిన రోజు బలవంతపెడితే తప్ప సీఐ కేసు నమోదు చేయలేదని, సీఐ సమక్షంలోనే మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి కట్లు కట్టించారని ఆమె వ్యాఖ్యలు చేశారు.