AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫస్ట్ జగన్.. లీస్ట్ మల్లాది

గత నెల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం విడుదలైన విషయం తెలిసిందే. అందులో 151 స్థానాలను సొంతం చేసుకున్న వైసీపీ పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమౌతోంది. కాగా ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ జగన్ మోహన్ రెడ్డికే దక్కింది. పులివెందుల నుంచి పోటీ చేసిన జగన్ తన ప్రత్యర్థి సతీష్ రెడ్డిపై అత్యధికంగా 90,110ఓట్లతో గెలుపొందారు. ఆ తరువాతి స్థానాల్లో అన్నా రాంబాబు(81,035), కిల్లివెటి సంజీవయ్య(61,292), సూర్య నారాయణ రెడ్డి(55,207), అంజాద్ బాషా(54,794)లు ఉన్నారు. […]

ఫస్ట్ జగన్.. లీస్ట్ మల్లాది
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 25, 2019 | 3:07 PM

Share

గత నెల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం విడుదలైన విషయం తెలిసిందే. అందులో 151 స్థానాలను సొంతం చేసుకున్న వైసీపీ పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమౌతోంది. కాగా ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ జగన్ మోహన్ రెడ్డికే దక్కింది. పులివెందుల నుంచి పోటీ చేసిన జగన్ తన ప్రత్యర్థి సతీష్ రెడ్డిపై అత్యధికంగా 90,110ఓట్లతో గెలుపొందారు. ఆ తరువాతి స్థానాల్లో అన్నా రాంబాబు(81,035), కిల్లివెటి సంజీవయ్య(61,292), సూర్య నారాయణ రెడ్డి(55,207), అంజాద్ బాషా(54,794)లు ఉన్నారు.

ఇక అత్యల్ఫ మెజారిటీ సాధించిన లిస్ట్‌లో మల్లాది విష్ణువర్ధన్ ఫస్ట్‌లో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన మల్లాది విష్ణు స్వల్ప ఓట్ల మెజారిటీతో గట్టేక్కారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమపై ఆయన కేవలం 25 ఓట్లతో గెలిచారు. ఆయన తరువాత కరుణాకర్ రెడ్డి(708), వరప్రసాద రావు(814), వల్లభనేని వంశీ(838), వీరంజనేయ స్వామి(1,024)లు ఉన్నారు. కాగా మరోవైపు ఎంపీల్లో వైఎస్ అవినాశ్ రెడ్డి 3,80,976ఓట్ల మెజారిటీ సాధించి టాప్‌లో ఉండగా.. గల్లా జయదేవ్ 4,205 మెజారిటీతో లీస్ట్‌లో ఉన్నారు.