AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పుడు చెప్పండి మీ స్టాండ్ ఏంటో..? బాబుకు విజయసాయి ప్రశ్న

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాటర్ వార్ జరుగుతోంది. ఇరు రాష్ట్రాల పార్టీల మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. కృష్ణా జలాల వివాదంపై ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ట్వీట్స్ వార్ మొదలైంది. నిత్యం ప్రతిపక్ష టీడీపీని ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై ట్వీట్టర్ వేదికగా విమర్శలు స్టార్ట్ […]

ఇప్పుడు చెప్పండి మీ స్టాండ్ ఏంటో..? బాబుకు విజయసాయి ప్రశ్న
TV9 Telugu Digital Desk
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: May 13, 2020 | 4:55 PM

Share

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాటర్ వార్ జరుగుతోంది. ఇరు రాష్ట్రాల పార్టీల మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. కృష్ణా జలాల వివాదంపై ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ట్వీట్స్ వార్ మొదలైంది. నిత్యం ప్రతిపక్ష టీడీపీని ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై ట్వీట్టర్ వేదికగా విమర్శలు స్టార్ట్ చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న కృష్ణా జలాల మధ్య చంద్రబాబు వైఖరి ఎంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో నంబర్. 203పై.. మీ వైఖరి ఏంటో చెప్పాలంటూ ప్రశ్నించారు. ప్రతి విషయంపై మీరు ఆన్‌లైన్‌ యాప్స్‌తో మాట్లాడే మీరు.. ఈ నెల 5వ తేదీన రిలీజ్ అయిన జీవో నంబర్.203పై ఇంకా ఎందుకు స్పందించడం లేదని.. ఘాటుగా స్పందించారు.