AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది బీజేపీ వ్యాక్సిన్, తీసుకోబోను, మా ప్రభుత్వం వస్తే అందరికీ ఉచితంగా టీకామందు , సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్

కోవిడ్ వ్యాక్సిన్ పై సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇది బీజేపీ వ్యాక్సిన్, తీసుకోబోను, మా ప్రభుత్వం వస్తే అందరికీ ఉచితంగా టీకామందు , సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 02, 2021 | 6:15 PM

Share

కోవిడ్ వ్యాక్సిన్ పై సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తను  ఈ టీకామందును తీసుకోబోనని, ఇది బీజేపీ వ్యాక్సిన్ కావడమే ఇందుకు కారణమని అన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతీవారికీ ఉచితంగా వ్యాక్సిన్ అందేట్టు చూస్తుందని పేర్కొన్నారు.  ప్రస్తుతం దీన్ని మాత్రం నమ్మే పరిస్థితి లేదన్నారు. అసలు యూపీలో ఈ పాండమిక్ ను అదుపు చేయడంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విఫలమైందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఈ వ్యాక్సిన్ కి కోల్డ్ చైన్, రిఫ్రిజిరేటర్లు ఎందుకు ?  ఈ ప్రభుత్వం ప్లేట్లపై శబ్దాలు చేయడం ద్వారా, చప్పట్లు చరచడం ద్వారా, హాస్పిటల్స్ పై హెలీకాఫ్టర్లను తిప్పడం  ద్వారా కరోనా వైరస్ ను మరింత ప్రబలం చేస్తోందన్నారు. దాన్ని నివారించడానికి బదులు ఈ పనులన్నీ చేస్తోందని ఆయన విమర్శించారు.

ఈ  వ్యాఖ్యలపై  తీవ్రంగా స్పందించిన యూపీ డిప్యూటీ సీఎం కె.పి. మౌర్య .. వ్యాక్సిన్లపై నమ్మకం లేని అఖిలేష్ యాదవ్ ని అసలు ప్రజలే నమ్మరని అన్నారు. ఇలా టీకామందుపై కామెంట్స్ చేయడం ద్వారా అయన డాక్టర్లను, దేశంలోని శాస్త్రజ్ఞులను అవమానపరిచారని పేర్కొన్నారు. ఇందుకు వారికి ఆయన క్షమాపణ చెప్పాలన్నారు.