AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గత ఐదేళ్లలో మోదీ ఎన్ని సెలవులు తీసుకున్నారో తెలుసా?

బీజేపీ ఆధ్వర్యంలో నగరంలోని శివాజీ పార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి బాలీవుడ్ నటి జుహీ చావ్లా, సీనియర్ నటుడు దలిప్ తాహిల్‌లు హాజరయ్యారు. “కాశ్మీర్ (కథనం), భారత వ్యతిరేక నినాదాలు, తప్పుడు ప్రచారం, దురభిప్రాయాన్ని తొలగించడం” అనే కార్యక్రమానికి వీరు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జుహీ చావ్లా మాట్లాడుతూ.. “అందరూ విభజించడం గురించి త్వరగా మాట్లాడతారు. మనం ఏకం కావడం గురించి ఎందుకు మాట్లాడకూడదు? అందరూ ‘ప్రభుత్వం ఏమి చేస్తోంది, ఎందుకు ఇలా చేస్తున్నారు?’ అని అడుగుతారు. […]

గత ఐదేళ్లలో మోదీ ఎన్ని సెలవులు తీసుకున్నారో తెలుసా?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 09, 2020 | 7:21 PM

Share

బీజేపీ ఆధ్వర్యంలో నగరంలోని శివాజీ పార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి బాలీవుడ్ నటి జుహీ చావ్లా, సీనియర్ నటుడు దలిప్ తాహిల్‌లు హాజరయ్యారు. “కాశ్మీర్ (కథనం), భారత వ్యతిరేక నినాదాలు, తప్పుడు ప్రచారం, దురభిప్రాయాన్ని తొలగించడం” అనే కార్యక్రమానికి వీరు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జుహీ చావ్లా మాట్లాడుతూ.. “అందరూ విభజించడం గురించి త్వరగా మాట్లాడతారు. మనం ఏకం కావడం గురించి ఎందుకు మాట్లాడకూడదు? అందరూ ‘ప్రభుత్వం ఏమి చేస్తోంది, ఎందుకు ఇలా చేస్తున్నారు?’ అని అడుగుతారు. కానీ, మేము ఏమి చేస్తున్నాం? అని ఎవరు ప్రశ్నించుకోరు. ప్రశాంతంగా ఉండండి, పరిస్థితిని అర్థం చేసుకోండి “అని తెలిపారు. గత ఐదేళ్లలో ఎవరైనా సెలవులు తీసుకోని వారు ఉన్నారంటే అది ఒక్క మన ప్రధాని మోదీయేనని పేర్కొన్నారు. దీంతో ‘మోదీ.. మోదీ’ అనే నినాదాలతో పార్క్ హోరెత్తింది. ప్రజలు ఐక్యత కంటే విభజన గురించి మాట్లాడటం విచారకరం అని జుహీ అన్నారు.