ఈ తరంలో వాళ్లిద్దరే గొప్ప ప్లేయర్స్ః సంగక్కర

|

Jun 03, 2020 | 4:47 PM

ఈ తరంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ- హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ గొప్ప జోడి అని శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర అన్నాడు. అతడు తాజా ఇంటర్వ్యూలో కోహ్లీ- రోహిత్‌లపై ప్రశంసలు కురిపించాడు.

ఈ తరంలో వాళ్లిద్దరే గొప్ప ప్లేయర్స్ః సంగక్కర
Follow us on

గిల్‌క్రిస్ట్‌- హేడెన్, పాంటింగ్- మార్టిన్, మెక్‌కలమ్‌- టేలర్, దిల్షాన్- జయసూర్య, సెహ్వాగ్- సచిన్, ద్రావిడ్- లక్ష్మణ్.. ఇలా ప్రతీ క్రికెట్ తరానికి ఒక్కో ముఖ్యజోడీ అదరగొడుతూ వచ్చింది. అలాగే ఈ తరంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ- హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ గొప్ప జోడి అని శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర అన్నాడు. అతడు తాజా ఇంటర్వ్యూలో కోహ్లీ- రోహిత్‌లపై ప్రశంసలు కురిపించాడు.

‘ప్రతీ తరంలో ఓ ముఖ్య జోడీ ఉంటుంది.. క్రికెట్ అంతా కూడా వారి చుట్టూనే తిరుగుతుంది. ఇక ఈ తరంలో ఆ జోడీ కోహ్లీ- రోహిత్‌’ అని అన్నాడు. వీరిద్దరూ కలిపి అన్ని ఫార్మాట్‌లలో 35,930 పరుగులు చేశారని సంగక్కర అన్నాడు. వన్డేల్లో నిబంధనలు మారడం వల్ల రన్స్ తేలికగా చేసినా.. ఇంతలా క్రికెట్ ఆడటం మాత్రం వీరిద్దరికీ తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదని సంగక్కర కితాబు ఇచ్చాడు.

Also Read:

ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..

కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు… రికవరీ రేటు కూడా సూపర్!

కరోనా లక్షణాలు పద్నాలుగు.. తేల్చి చెప్పిన ఐసీఎంఆర్..!

ఏపీలో జూలై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. విద్యార్ధుల కోసం 8 లక్షల మాస్కులు..

వారికి ఓపిక లేకనే కాలి నడకన ఇళ్లకు బయల్దేరారు..

విదేశీ వస్తువులను ఎలా నిషేదించాలి.? మీరే చెప్పాలి అమిత్ జీ..