చంద్రబాబునాయుడు నగర్ వాసులకు కేటీఆర్ ఆర్థిక సాయం

|

Oct 21, 2020 | 1:12 PM

హైదరాబాద్ తార్నాక డివిజన్ లాలాపేట్ ముంపు ప్రాంతాల ప్రజలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కొంచెంసేపటి క్రితం పరామర్శించారు. చంద్రబాబు నాయుడు నగర్‌లోని వరద బాధితులకు ప్రభుత్వం తరపున కుటుంబానికి 10 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. హైదరాబాద్ లోని వరద ముంపు ప్రాంతాలలో తాత్కాలిక ప్రభుత్వం సాయం కింద కుటుంబానికి 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అ౦దజేస్తున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. డివిజన్‌లలోని ముంపు ప్రాంతాలలో ఏమైనా […]

చంద్రబాబునాయుడు నగర్ వాసులకు కేటీఆర్ ఆర్థిక సాయం
Follow us on

హైదరాబాద్ తార్నాక డివిజన్ లాలాపేట్ ముంపు ప్రాంతాల ప్రజలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కొంచెంసేపటి క్రితం పరామర్శించారు. చంద్రబాబు నాయుడు నగర్‌లోని వరద బాధితులకు ప్రభుత్వం తరపున కుటుంబానికి 10 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. హైదరాబాద్ లోని వరద ముంపు ప్రాంతాలలో తాత్కాలిక ప్రభుత్వం సాయం కింద కుటుంబానికి 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అ౦దజేస్తున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. డివిజన్‌లలోని ముంపు ప్రాంతాలలో ఏమైనా సమస్య ఉంటే స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకొనిరండని కేటీఆర్ సూచించారు. బాధిత కుటుంబాలు అందరికీ ఆర్థిక సహాయం అందుతుందని.. ఎవరు ఆందోళన చెందవద్దని కేటీఆర్ ఈ సందర్భంగా బాధితులకు భరోసా ఇచ్చారు. కేటీఆర్ వెంట స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, తార్నాక డివిజన్ కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి తదితరులు ఉన్నారు.