AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కరోనా సంక్రమణ వేగం తగ్గింది..: ఐఎంఎస్సీ

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తున్న దశలో ఐఎంఎస్సీ శుభవార్త వినిపించింది. భారత్ లో కరోనా వ్యాప్తి తీరుతెన్నులపై చెన్నైకి చెందిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్ (ఐఎంఎస్సీ) చేపట్టిన అధ్యయనంలో

దేశంలో కరోనా సంక్రమణ వేగం తగ్గింది..: ఐఎంఎస్సీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 07, 2020 | 4:34 PM

Share

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తున్న దశలో ఐఎంఎస్సీ శుభవార్త వినిపించింది. భారత్ లో కరోనా వ్యాప్తి తీరుతెన్నులపై చెన్నైకి చెందిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్ (ఐఎంఎస్సీ) చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర అంశం వెల్లడైంది. లాక్ డౌన్ నిబంధనలు సడలించినా, కరోనా సంక్రమించే వేగంలో పెరుగుదల లేదని, లాక్ డౌన్ ముందు ఉన్న వేగంతో పోల్చితే ఇప్పుడు ఇంకా తగ్గిందని ఐఎంఎస్సీ వివరించింది.

వివరాల్లోకెళితే.. భారత దేశంలో మార్చి 22 ముందు (లాక్ డౌన్ విధించక ముందు) కరోనా ఒక వ్యక్తి నుంచి ఇతరులకు సంక్రమించే శాతం 1.83గా ఉందని, ఇప్పుడది 1.22 మాత్రమే ఉందని పరిశోధకులు వెల్లడించారు. అంటే, 100 మంది కరోనా రోగుల నుంచి 183 మందికి వ్యాప్తి చెందుతుందని, ప్రస్తుతం 100 మంది ద్వారా 122 మందికి మాత్రమే సోకుతుందని వివరించారు. సడలింపుల నేపథ్యంలో ప్రజలు బయటికి రావడం ఎక్కువైనా సంక్రమణ వేగంలో పెరుగుదల లేదని తెలిపారు. మొత్తంమీద కరోనా సంక్రమణ వేగం 1 కంటే తక్కువ నమోదైనప్పుడు వైరస్ నిర్మూలన మొదలైనట్టుగా భావించాలని పేర్కొన్నారు.

Also Read: విద్యుత్ బిల్లు.. వాయిదాల్లో కట్టొచ్చు.. కానీ..