హైదరాబాద్: దర్శకుడు రాజ్ కిరణ్ అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప గుండెపోటు రావడంతో ఆయన్ను కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. రాజ్ కిరణ్ ‘గీతాంజలి’, ‘త్రిపుర’, ‘లక్కున్నోడు’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. నందిత ప్రధాన పాత్రలో ఆయన తీసిన ‘విశ్వామిత్ర’ సినిమా ఈ నెల 14న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో సత్యం రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్న, విద్యుల్లేఖ రామన్ నటించారు. మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్ నిర్మాతలు. వాస్తవ సంఘటనలతో ఈ సినిమాను రూపొందించారు.