AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రామ సచివాలయాల్లో జూన్ 8 నుంచి శ్రీవారి దర్శనం టిక్కెట్లు..

వెంకన్న దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో జూన్ 8 నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో రోజుకు మూడు వేల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.

గ్రామ సచివాలయాల్లో జూన్ 8 నుంచి శ్రీవారి దర్శనం టిక్కెట్లు..
Ravi Kiran
|

Updated on: Jun 05, 2020 | 9:04 PM

Share

అన్ లాక్-1 నేపథ్యంలో టీటీడీ మళ్లీ శ్రీవారి దర్శనాలను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తొలుత ట్రయిల్ రన్‌లో భాగంగా ఈ నెల 8,9,10 తేదీల్లో స్థానికులు, టీటీడీ ఉద్యోగులకు అనుమతి ఇవ్వనుండగా.. సాధారణ భక్తులకు ఈ నెల 11వ తేదీ నుంచి అనుమతించనున్నారు. ఇదిలా ఉంటే వెంకన్న దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో జూన్ 8 నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో రోజుకు మూడు వేల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.

ఇక ఆన్‌లైన్‌ ద్వారా దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసినవారికి గదులు కేటాయిస్తామని.. గ్రామ సచివాలయంలో కూడా తిరుమల శ్రీవారి దర్శనం టిక్కెట్లు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చునని తెలిపారు. దర్శనాలకు వచ్చే భక్తులు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరని అన్నారు. కాగా, రోజుకు 200 మందికి ర్యాండమ్ గా పరీక్షలు నిర్వహించనుండగా.. టెస్టుల తర్వాతే కొండపైకి అనుమతించనున్నారు.