AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్‌కు బెదిరింపులు..!

ప్రముఖ పారిశ్రామిక వేత్త, దక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్ వెంకటరామి రెడ్డిని ఇంటికొచ్చి బెదిరించిన ఎన్‌ఆర్‌ఐలు. వెంకటరామి రెడ్డిని కలవాలంటూ బొకే తీసుకుని ఇంట్లోకి వెళ్లిన ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు విశాకన్, రాకేష్ రాజ్. మాకు రూ.18 కోట్లు ఇవ్వాలంటూ వెంకటరామి రెడ్డి, భార్య మంజులా రెడ్డితో వాగ్వాదం చేసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు భార్యాభర్తలిద్దర్నీ నిర్భందించినట్టు సమాచారం. ఆస్ట్రేలియాకు చెందిన విశాకన్, రాకేష్ ఇదివరకే ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారని, ఇవ్వకపోయే సరికి ఇంటికొచ్చి […]

దక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్‌కు బెదిరింపులు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 17, 2019 | 4:01 PM

Share

ప్రముఖ పారిశ్రామిక వేత్త, దక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్ వెంకటరామి రెడ్డిని ఇంటికొచ్చి బెదిరించిన ఎన్‌ఆర్‌ఐలు. వెంకటరామి రెడ్డిని కలవాలంటూ బొకే తీసుకుని ఇంట్లోకి వెళ్లిన ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు విశాకన్, రాకేష్ రాజ్. మాకు రూ.18 కోట్లు ఇవ్వాలంటూ వెంకటరామి రెడ్డి, భార్య మంజులా రెడ్డితో వాగ్వాదం చేసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు భార్యాభర్తలిద్దర్నీ నిర్భందించినట్టు సమాచారం. ఆస్ట్రేలియాకు చెందిన విశాకన్, రాకేష్ ఇదివరకే ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారని, ఇవ్వకపోయే సరికి ఇంటికొచ్చి బెదిరించినట్లు వెంకటరామి రెడ్డి పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విశాకన్, రాకేష్ రాజ్‌లను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. అయితే.. వారికి ఇవ్వవలసిన అప్పు కారణంగానే ఇంటికొచ్చి అడిగినట్లు పేర్కొన్నారు ఎన్‌ఆర్‌ఐలు.