‘ఎలక్షన్ ప్యాకేజ్’ బిజీలో టూర్ ఆపరేటర్లు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ట్రావెల్ కంపెనీలు మార్కెటింగ్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందుకు ఎన్నికలను కూడా వాడుకుంటున్నాయి. ఓటేయడానికి వెళ్లే వారికి క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నాయి. ట్రావెల్ దిగ్గజం థామస్కుక్ ఇటీవలే ‘ఘర్ జావో ఓట్ కరో’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది మార్చి 26న ప్రారంభమైంది. మే 19 వరకు అందుబాటులో ఉండనుంది. ఇందులో భాగంగా ఊరు వెళ్లి ఓటేసి తిరిగి వచ్చేటప్పుడు రిటర్న్ ఎయిర్ టికెట్పై రూ.1,000 డిస్కౌంట్ పొందొచ్చు. దీనికి ఓటర్ కార్డు లేదా […]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ట్రావెల్ కంపెనీలు మార్కెటింగ్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందుకు ఎన్నికలను కూడా వాడుకుంటున్నాయి. ఓటేయడానికి వెళ్లే వారికి క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నాయి. ట్రావెల్ దిగ్గజం థామస్కుక్ ఇటీవలే ‘ఘర్ జావో ఓట్ కరో’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది మార్చి 26న ప్రారంభమైంది. మే 19 వరకు అందుబాటులో ఉండనుంది.
ఇందులో భాగంగా ఊరు వెళ్లి ఓటేసి తిరిగి వచ్చేటప్పుడు రిటర్న్ ఎయిర్ టికెట్పై రూ.1,000 డిస్కౌంట్ పొందొచ్చు. దీనికి ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఈ కంపెనీ ఎన్నికల అయిపోయిన తర్వాత కూడా హాలిడే టూర్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. దేశీ, విదేశీ ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. దేశీ టూర్లపై రూ.3,000, విదేశీ టూర్లపై రూ.5,000 డిస్కౌంట్ అందిస్తోంది. జూలై 19 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న థామస్కుక్ రిటైల్ ఔట్లెట్స్లో ఈ ఆఫర్ పొందొచ్చు.
‘మేం ప్రజలను వారి ఊరుకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రోత్సహిస్తున్నాం. అందుకే ఘర్ జావో ఓట్ కరో కార్యక్రమాన్ని ప్రారంభించాం’ అని థామస్కుక్ ఇండియా ప్రెసిడెంట్ అబ్రహం అలపత్ వెల్లడించారు.