AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నన్ను అడిగాడు.. నేను నో చెప్పాను-అభిషేక్ సింఘ్వీ

రాజస్థాన్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ తనను న్యాయ సలహా అడిగారని.. అందుకు తాను నిరాకరించానని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మనూ సింఘ్వీ...

నన్ను అడిగాడు.. నేను నో చెప్పాను-అభిషేక్ సింఘ్వీ
Sanjay Kasula
|

Updated on: Jul 17, 2020 | 11:03 AM

Share

రాజస్థాన్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ తనను న్యాయ సలహా అడిగారని.. అందుకు తాను నిరాకరించానని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మనూ సింఘ్వీ స్పష్టం చేశారు. ఇప్పటికీ తామిద్దరమూ మంచి స్నేహితులమే అని, అయితే న్యాయ సలహా ఇవ్వడానికి మాత్రం తాను నిరాకరించానని చెప్పారు. ఎందుకంటే… ఈ విషయంలో తాను స్పీకర్ జోషి వైపు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకే అని చెప్పుకొచ్చారు. సచిన్ పైలట్ చాలా తెలివైనవాడు. అతని ప్రతిభను మెచ్చుకునే నేతలు చాలా మందే ఉన్నారు. అయితే… పరిస్థితులు ఇక్కడి వరకూ రావడమే బాధాకరం.