AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tragedy: బతికున్న వ్యక్తిపై మట్టి కప్పేశారు..కాపాడే క్రమంలో చంపేశారు..!

తమిళనాడులో అత్యంత విషాదకర ఘటన జరిగింది. మధురైలో ఓ వ్యక్తి అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయాడు. మధురైలోని విలాంగుడి ప్రాంతంలో రామమూర్తి నగర్ వద్ద డ్రైనేజి పైపుల పని జరుగుతోంది.

Tragedy: బతికున్న వ్యక్తిపై మట్టి కప్పేశారు..కాపాడే క్రమంలో చంపేశారు..!
Inter Student Dies
Jyothi Gadda
|

Updated on: Jun 05, 2022 | 6:59 AM

Share

తమిళనాడులో అత్యంత విషాదకర ఘటన జరిగింది. మధురైలో ఓ వ్యక్తి అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయాడు. మధురైలోని విలాంగుడి ప్రాంతంలో రామమూర్తి నగర్ వద్ద డ్రైనేజి పైపుల పని జరుగుతోంది. సతీష్ అలియాస్ వీరనన్ అనే కార్మికుడు కూడా ఈ పనిలో ఉన్నాడు. అయితే, 11 అడుగుల గుంతలో ఉన్న సతీష్ ను గమనించకుండా, పైపులపై మట్టి కప్పేశారు సహాచర కూలీలు. దీంతో ఆ గుంతలో మట్టి కింద అతను చిక్కుకుపోయాడు. కాసేపటి తర్వాత సతీష్ ను కూడా తాము పూడ్చేశామని గ్రహించిన ఇతర కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడే ఉన్న ఓ జేసీబీ సాయంతో ఆ గుంతను తిరిగి తవ్వడం ప్రారంభించారు. కానీ దురదృష్టవశాత్తు ఆ జేసీబీ హ్యాండ్ తగిలి సతీష్ తల తెగిపోయింది. ఈ ఘటనలో సతీష్ మృతి చెందడంతో తోటి కూలీలు దిగ్భ్రాంతికి గురయ్యారు. అగ్నిమాపక దళ సిబ్బంది అక్కడికి వచ్చేసరికి ఘోరం జరిగిపోయింది.

నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందంటూ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైట్ ఇంజినీర్ సికందర్, సూపర్ వైజర్ బాలు, జేసీబీ ఆపరేటర్ సురేశ్ లను అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుడు సతీష్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. సతీష్ మృతితో అతని కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Follow Us
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం
MI vs SRH Playing XI: టాస్ గెలిచిన ముంబై..
MI vs SRH Playing XI: టాస్ గెలిచిన ముంబై..
రజనీతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
రజనీతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఆ AI చిప్‌ని దేవుడే నా బ్యాట్ లో ఫిక్స్ చేశాడు..: వైభవ్ సూర్యవంశీ
ఆ AI చిప్‌ని దేవుడే నా బ్యాట్ లో ఫిక్స్ చేశాడు..: వైభవ్ సూర్యవంశీ
అవి ఇస్తే నిత్యావసర సరుకులు ఫ్రీ.. ఏపీ ప్రభుత్వం డెసిషన్
అవి ఇస్తే నిత్యావసర సరుకులు ఫ్రీ.. ఏపీ ప్రభుత్వం డెసిషన్
ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్..
ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్..