షాకింగ్: ఇకపై సెల్ ఫోన్ కొంటే చార్జర్ ఇవ్వరంట..!

మొబైల్ ఫోన్ వినియోగదారులకు షాకివ్వబోతున్నాయి ఫోన్ తయారీ సంస్థలు. ఇప్పటి వరకూ ఫోన్ కొంటే ఫోన్ తో పాటు ఇయర్ ఫోన్స్, చార్జర్లు ఫ్రీగా కంపెనీలు అందించేవి. అయితే, వచ్చే ఏడాది నుంచి కొన్ని కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌ బాక్సులో ఇకపై ఛార్జర్‌ ఉండవంటున్నాయి.

షాకింగ్: ఇకపై సెల్ ఫోన్ కొంటే చార్జర్ ఇవ్వరంట..!
Follow us

|

Updated on: Jul 10, 2020 | 12:29 PM

ఫోన్స్, చార్జర్లు ఫ్రీగా కంపెనీలు అందించేవి. అయితే, వచ్చే ఏడాది నుంచి కొన్ని కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌ బాక్సులో ఇకపై ఛార్జర్‌ ఉండవంటున్నాయి. గత కొన్నేళ్లుగా ఇయర్ ఫోన్స్ నిలిపివేసిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు తాజాగా ఫోన్‌ ఛార్జర్లు కూడా మొబైల్‌తో పాటు అందించకూడదని ఇప్పుడు కంపెనీలు ఆలోచిస్తున్నాయి. ఇందులో భాగంగా ముందడుగు వేసిన ఆపిల్, శాంసంగ్ కంపెనీలు వచ్చే ఏడాది జనవరి నుంచి ఫోన్‌ బాక్సులో ఛార్జర్‌ లేకుండా స్మార్ట్‌ఫోన్లను విక్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇకపై కంపెనీలు ఫోన్లు, ఛార్జర్లను వేర్వేరుగా అమ్మే అవకాశం ఉంది. పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికే శాంసంగ్‌, యాపిల్‌ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

భవిష్యత్‌లో విడుదల చేసే ఐఫోన్‌ మోడళ్లలో పవర్‌ ఎడాప్టర్‌, ఇయర్‌పాడ్స్‌ లేకుండా తమ ఉత్పత్తులను విక్రయించాలని యాపిల్‌ నిర్ణయించింది. ఈ ఏడాది చివర్లో విడుదలకానున్న ఐఫోన్‌ 12తో యాపిల్‌ ఛార్జర్‌ను ఉచితంగా అందించదని వార్తలు వస్తున్నాయి. రాబోయే ఐఫోన్లతో పాటు ఛార్జర్లను ఇవ్వడాన్ని నిలిపివేయాలని యాపిల్ భావిస్తున్నట్లు యాపిల్‌ విశ్లేషకుడు మింగ్‌ చి కుయో తెలిపారు. 20W ఫాస్ట్‌ ఛార్జర్‌ను విడిగా విక్రయిస్తుందని ఆయన చెప్పారు. 5W, 18W పవర్‌ ఎడాప్టర్ల ఉత్పత్తిని ఏడాది చివర్లో నిలిపివేయాలనుకుంటుందన్నారు. ఇక మరో సెల్ ఫోన్ తయారీ దిగ్గజం శాంసంగ్ కూడా ఇదే అంశాన్ని ఆలోచిస్తున్నట్లు కొరియన్‌ వార్తాసంస్థ ఈటీ న్యూస్‌ వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి కొన్ని స్మార్ట్‌ఫోన్లతో పాటు ఛార్జర్లు ఇవ్వకూడదని శాంసంగ్‌ నిర్ణయించిందని తెలిపింది. చాలా మంది వినియోగదారుల వద్ద ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో స్మార్ట్‌ఫోన్‌ ఛార్జర్లు ఉండటంతో కంపెనీ ఆదిశగా ఆలోచిస్తున్నదని వెల్లడించింది. ఛార్జర్లు తగ్గించడంతో ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుందని అటు ఇ-వేస్ట్‌ను తగ్గించినట్లవుతుందని సెల్ ఫోన్ తయారీ సంస్థలు భావిస్తున్నాయి.