చిత్తూరు జిల్లాలో గుప్తనిధులు.!

|

Oct 01, 2020 | 3:30 PM

చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల ముఠా పోలీసులకు చిక్కింది. దీనికి సంబంధించి ఎనిమిది మంది నిందితుల్ని చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం గంగాధర నెల్లూరు మండలం అగరమంగళంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో వీళ్లు గుప్తనిధుల తవ్వకాలు జరిపినట్టు పోలీసులు నిర్ధారించారు. గుడిలోని నంది విగ్రహాన్ని పెకలించి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారని పోలీసులు వెల్లడించారు. ముఠాలో కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతూరుకు చెందిన సోమశేఖర్ తో పాటు మరో ఏడు […]

చిత్తూరు జిల్లాలో గుప్తనిధులు.!
Follow us on

చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల ముఠా పోలీసులకు చిక్కింది. దీనికి సంబంధించి ఎనిమిది మంది నిందితుల్ని చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం గంగాధర నెల్లూరు మండలం అగరమంగళంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో వీళ్లు గుప్తనిధుల తవ్వకాలు జరిపినట్టు పోలీసులు నిర్ధారించారు. గుడిలోని నంది విగ్రహాన్ని పెకలించి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారని పోలీసులు వెల్లడించారు. ముఠాలో కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతూరుకు చెందిన సోమశేఖర్ తో పాటు మరో ఏడు మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు.

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, మహానంది, గుంటూరు జిల్లాలోని మాచర్ల తో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలలోని ఆలయాల్లో రెక్కీ నిర్వహించి ఈ ముఠా తవ్వకాలకు ప్రయత్నించినట్లు పోలీసులు తేల్చారు. గుప్తనిధులు తోపాటు రైస్ పుల్లింగ్ మోసాలకు కూడా ఈ గ్యాంగ్ పాల్పడినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ స్పష్టం చేశారు. పాత టీవీలు, రేడియోలు, గ్రామ్ ఫోన్ రికార్డులను అధిక ధరలకు కొనుగోలు చేస్తామంటూ కూడా ఈ గ్యాంగ్ జనాన్ని మోసం చేసినట్టు ఎస్పీ చెప్పారు.