AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Highcourt: తెలంగాణ హైకోర్టులో కార్పొరేట్ కాలేజీలకు చుక్కెదురు.. స్టే ఇచ్చేది లేదంటూ స్పష్టం చేసిన ధర్మానం..

రాష్ట్రంలో నారాయణ, శ్రీచైతన్య కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.

Telangana Highcourt: తెలంగాణ హైకోర్టులో కార్పొరేట్ కాలేజీలకు చుక్కెదురు.. స్టే ఇచ్చేది లేదంటూ స్పష్టం చేసిన ధర్మానం..
Shiva Prajapati
|

Updated on: Dec 17, 2020 | 1:35 PM

Share

రాష్ట్రంలో నారాయణ, శ్రీచైతన్య కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌ను దంతం రాజేష్ దాఖలు చేశారు. కాగా, గతంలోనే నిబంధనలకు విరుద్ధంగా నడస్తున్న నారాయణ, శ్రీచైతన్య కు సంబంధించిన 68 కాలేజీలతో పాటు మిగతా కార్పొరేట్ కాలేజీలను మూసివేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నాటి ఆదేశాలను ఉటంకించిన ధర్మాసనం.. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఎన్ని కాలేజీలను మూసివేశారో వివరణ ఇవ్వాలంటూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి సమాచారం తీసుకుని ఇవ్వాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. మరోవైపు కళాశాలలు తెరవడానికి అనుమతి ఇవ్వాలంటూ కార్పొరేట్ కళాశాలల తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. కాలేజీలను మూసివేయాలంటూ గతంలో ఇచ్చిన ఆర్డర్‌పై స్టే విధించాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అయితే గత ఆర్డర్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 31వ తేదీకి వాయిదా వేసింది.

Also read:

హైద‌రాబాద్‌: డ్రగ్స్ కేసులు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలన్న పిల్ పై హైకోర్టులో విచారణ

భూ కబ్జాలకు పాల్పడాలంటే భయపడాలి… గుజరాత్‌లో మాదిరి చట్టాన్ని తీసుకురావాలి… 14 ఏళ్ల జైలు శిక్ష విధించాలి…