AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో కొత్తగా 1,640 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం రాష్ట్రంలో 1,640 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా కొత్తగా ఎనిమిది మంది చనిపోయారు.

తెలంగాణలో కొత్తగా 1,640 మందికి కరోనా పాజిటివ్
Balaraju Goud
|

Updated on: Jul 24, 2020 | 9:48 PM

Share

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం రాష్ట్రంలో 1,640 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా కొత్తగా ఎనిమిది మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 52,466కి మరణాల సంఖ్య 447కి చేరుకుంది. ఈరోజు కరోనా నుంచి1,007 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో కలిసి మొత్తంగా రికవరీ అయిన వారి సంఖ్య 40,334కు పెరిగింది. మొత్తం నమోదైన కేసుల్లో ఇది 76.8 శాతమని రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 683 నమోదయ్యాయి. మరోవైపు 11,677 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం 15,445 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 3,37,771 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది.