Telangana Corona Cases: తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 152 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఒకరు ప్రాణాలు విడిచారు. ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,94,739కు చేరింది. ఈ ప్రమాదకర వైరస్ సోకి ఇప్పటివరకు 1,602 మంది చనిపోయారు. కరోనా నుంచి తాజాగా 221 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,91,115 కు చేరింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 2,022 కరోనా యాక్టివ్ కేసులన్నాయి. వారిలో 659 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ మంగళవారం రిలీజ్ చేసిన బులిటెన్లో తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 29కరోనా కేసులు నమోదయ్యాయి.
మరోవైపు కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. అత్యంత వేగంగా టీకాలు వేస్తున్న దేశంగా ఇండియా రికార్డులకెక్కింది.
Also Read: