AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాసేపట్లో యాదాద్రికి సీఎం కేసీఆర్

తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సందర్శించనున్నారు.

కాసేపట్లో యాదాద్రికి సీఎం కేసీఆర్
Balaraju Goud
|

Updated on: Sep 13, 2020 | 9:19 AM

Share

తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సందర్శించనున్నారు. ఐదేళ్ల క్రితం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి నిర్మాణ తీరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రికి రావడం ఇది 13వ సారి. ఆదివారం ఉదయం యాదాద్రి కొండపైకి చేరుకొని తొలుత బాలాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కొండపై ప్రధానాలయాల పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు.

దేశంలో అత్యంత సుప్రసిద్ధ ఆలయంగా యాదాద్రి నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందులో భాగంగా ఆలయాన్ని అద్భుత రాతి కట్టడంగా అపురూప శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. యాదాద్రి కొండకు నలు దిక్కుల ఉన్న కొండలను ఆలయానికి అనుగుణంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని సందర్శనున్నారు. ఆలయ పరిసరాలు, భక్తులకు మౌలిక సదుపాయాలతో పాటు కొండకింద రహదారుల అభివృద్ధి, వసతి సదుపాయాల కల్పన, పచ్చదనానికి అనుగుణం మొక్కల పెంపకం, నీటి కొలను నిర్మాణం వంటి అంశాలపై సీఎం కేసీఆర్‌ పర్యటనలో దృష్టి సారించే అవకాశాలున్నాయి.

ఆలయ ఉద్ఘాటన సందర్భంగా నిర్వహించనున్న మహాసుదర్శన యాగం ఏర్పాట్లను కూడా సీఎం పరిశీలించనున్నట్లు సమాచారం. నిర్దేశిత గడువులోగా పనులు సంపూర్ణం చేసేందుకు తన పర్యటనలో అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు సీఎం రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొమ్మిదిమాసాల తర్వాత వస్తుండటంతో పనుల పురోగతిని ఆయనకు వివరించేందుకు వైటీడీఏ, ఆర్‌అండ్‌బీ అధికారులు, స్థపతులు అంతర్గత సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌, రాచకొండ కమిషనరేట్‌ భువనగిరి జోన్‌ డీసీపీ కె.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు.