Telangana Corona Cases: తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 37,451 కరోనా టెస్టులు చేయగా 351 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,89,784కి చేరింది. కొత్తగా మరో ఇద్దరు కరోనా మహమ్మారి కారణంగా మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,565కి చేరింది. కరోనాబారి నుంచి శనివారం 415 మంది కోలుకున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,89,784కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,756 ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం రిలీజ్ చేసిన బులిటెన్లో పేర్కొంది. వీరిలో 2,584 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నట్లు వివరించింది. కాగా తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ టెస్టుల సంఖ్య 72,53,236కి చేరింది.
పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ..జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.
Also Read : Jagananna Amma Vodi: ఎన్నికల కోడ్ ఉన్నా ‘అమ్మఒడి’ పథకం యథాతథం.. స్పష్టం చేసిన విద్యాశాఖ మంత్రి