చంద్రబాబు ‘ఉల్లి’ నిరసన.. తమాషాలు చేస్తున్నారా..!

| Edited By: Srinu

Dec 09, 2019 | 2:00 PM

పెరిగిన ఉల్లి ధరలపై వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ వినూత్న తరహాలో నిరసన తెలిపింది. వెంకట పాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు.. ఉల్లి పాయల దండలను మెడలో వేసుకుని అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లారు. అయితే.. గేటు ముందున్న భద్రతా సిబ్బంది.. చంద్రబాబును సహా టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ప్లకార్డులతో వస్తే.. లోపలికి అనుమతించబోమని తెలుపగా.. దీంతో.. టీడీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. కాగా.. భద్రతా సిబ్బందిపై తీవ్ర చంద్రబాబు ఆగ్రహం […]

చంద్రబాబు ఉల్లి నిరసన.. తమాషాలు చేస్తున్నారా..!
Follow us on

పెరిగిన ఉల్లి ధరలపై వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ వినూత్న తరహాలో నిరసన తెలిపింది. వెంకట పాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు.. ఉల్లి పాయల దండలను మెడలో వేసుకుని అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లారు. అయితే.. గేటు ముందున్న భద్రతా సిబ్బంది.. చంద్రబాబును సహా టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ప్లకార్డులతో వస్తే.. లోపలికి అనుమతించబోమని తెలుపగా.. దీంతో.. టీడీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. కాగా.. భద్రతా సిబ్బందిపై తీవ్ర చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తున్నారా అంటూ.. ఆయన మండిపడ్డారు.

కాగా.. అటు మండలిలోకి ప్లకార్డులతో వెళ్లేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం ఎమ్మెల్సీ టీడీ జనార్థన్‌ను మార్షల్స్ అడ్డుకున్నారు. ప్లకార్డులతో లోనికి అనుమతి లేదని ఆయన్ని ఆపారు. దీంతో.. మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్సీ జనార్థన్. అయితే.. మార్షల్స్‌ని తోసుకుని లోపలికి వెళ్లేందుకు టీడీ జనార్థన్ ప్రయత్నించాగా.. కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది.