తమిళనాడులో ఇవాళ కరోనా 38 మంది మృతి
తమిళనాడులో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే కరోనాతో 38 మంది ప్రాణాలు విడిచారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 704 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,396 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఆ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
తమిళనాడులో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే కరోనాతో 38 మంది ప్రాణాలు విడిచారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 704 మంది మృత్యువాత పడ్డారని ఆ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,396 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ర్టంలో పాజిటివ్ కేసుల సంఖ్య 56,845కు చేరింది. కరోనాను జయించి శనివారం 1,405 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు ఈ వైరస్ నుంచి 31,316 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దేశంలోని కరోనా కేసుల సంఖ్యలో తమిళనాడు రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే చెన్నైలో అత్యధికంగా 38,327, చెంగల్ పట్టులో 3,432, తిరువల్లూరులో 2,291, కంచీపురంలో 1,001, తిరువన్నమలైలో 853 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.