Tadepalli And Mangalagiri: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలను మోడల్ పట్టణాలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రెండు పట్టణాలను రూ. రూ.1,173 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా.. తొలిదశలో భాగంగా రూ. 20 కోట్లను పురపాలిక శాఖ మంజూరు చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. కాగా, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక రూపకల్పన బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్కు అప్పగించింది.
Also Read:
గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్’.. కేవలం రూ. 35కే..
మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..
మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..