AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణకు ‘స్ట్రెయిన్’ వైరస్ గుబులు.. బ్రిటన్ నుంచి వచ్చిన 1200 మందికి కరోనా పరీక్షలు.!

Strain Virus In Telangana: బ్రిటన్‌ నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో 16 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ప్రజా ఆరోగ్య శాఖ ..

తెలంగాణకు 'స్ట్రెయిన్' వైరస్ గుబులు.. బ్రిటన్ నుంచి వచ్చిన 1200 మందికి కరోనా పరీక్షలు.!
Ravi Kiran
|

Updated on: Dec 25, 2020 | 7:30 PM

Share

Strain Virus In Telangana: బ్రిటన్‌ నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో 16 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. వారిని వివిధ ఆసుపత్రుల్లోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. పాజిటివ్ వచ్చినవారికి సంబంధించిన 76 మంది ప్రైమరీ కాంటాక్టులను హోం క్వారంటైన్‌లో ఉంచామని.. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే కరోనా సోకిన 16 మందిలో హైదరాబాద్ నుంచి నలుగురు, జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి నలుగురు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

వీరిలో ఉన్న వైరస్ జీనోమ్ సీక్వెన్స్ తెలుసుకునేందుకు సాంపిల్స్‌ను సీసీఎంబీకి పంపించామని శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. అటు నెగటివ్ వచ్చినవారిని కూడా మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. కాగా, డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు యూకే నుంచి, యూకే మీదుగా తెలంగాణకు 1200 మంది ప్రయాణీకులు వచ్చినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ గుర్తించింది.

Also Read:

Bigg Boss 4: మెహబూబ్ సైగలపై స్పందించిన అభిజిత్.. ‘స్టార్ మా’ తేల్చాలంటూ ఆసక్తికర కామెంట్స్.!

కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి.!

ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం దుకాణాలు, బార్లపై నిషేధం లేదంటూ..!

షాకింగ్ న్యూస్: కరోనా లక్షణాలు లేవని ఆఫీస్‌కు వచ్చిన ఉద్యోగి.. ఏడుగురు మృతి, 300 మంది క్వారంటైన్.!