కొలంబో: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే శుభాకాంక్షలు తెలిపారు. ‘అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు కంగ్రాట్స్ నరేంద్ర మోదీజీ. మీతో కలిసి పనిచేయాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పూర్తి ఆధిక్యంతో దూసుకెళ్తోంది. మెజార్టీ మార్క్ను దాటి 330కి పైగా స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.