వేములవాడ ఆలయంలో ఈ రాత్రి “పాలల్లో చంద్ర దర్శనం”

శుక్రవారం రాజన్న ఆలయంలో రాత్రి 11.30 గంటలకు పాలల్లో చంద్ర దర్శనం కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం కోసం అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ రోజు జరిగే చంద్ర దర్శన కార్యక్రమాన్ని "కో జాగిరి" అని కూడా అంటారు.

వేములవాడ ఆలయంలో ఈ రాత్రి పాలల్లో చంద్ర దర్శనం

Updated on: Oct 30, 2020 | 7:58 PM

Revathi Nakshatra : రేవతి నక్షత్రం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.

అనుబంధ అలయమైన అనంత పద్మనాభ స్వామివారికి పంచోపనిషత్తుల ద్వారా అభిషేక పూజలను ఆలయ స్నానాచార్యులు అప్పాల భీమశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాజన్న ఆలయంలో రాత్రి 11.30 గంటలకు పాలల్లో చంద్ర దర్శనం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు  అర్చకులు తెలిపారు.

Follow Us