కుర్రాళ్లను ఫిదా చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్

08 June 2026

Pic credit - Instagram

Rajeev 

భాగ్యశ్రీ బోర్సే..  మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 తో ఎంట్రీ ఇచ్చింది.

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ గా చేసింది.

తొలి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది. ఈ అమ్మడి అందానికి ఫిదా అయ్యారు కుర్రకారు.

అందంతోనే కాదు ఈ అమ్మడు మిస్టర్ బచ్చన్ సినిమాలో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది.

ఆతర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన యాక్షన్ మూవీ కింగ్‌డమ్‌ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది.

ఆతర్వాత దుల్కర్ సల్మాన్ హీరో సరసన కాంత అనే సినిమా చేసింది. తెలుగు, తమిళ్ లో విడుదలైన ఈ సినిమా నిరాశపరిచింది.

చివరిగా ఈ అమ్మడు నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా కూడా పెద్దగా హిట్ అవ్వలేదు.. ప్రస్తుతం లెనిన్ అనే సినిమాలో నటిస్తుంది.