AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధ్యక్షుని ఎన్నిక ఇప్పుడే కాదు.. కాంగ్రెస్ లో ఇక జోనల్ కమిటీలు..

కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుని ఎన్నికపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిజానికి పార్టీకి నూతన ప్రెసిడెంటును ఎన్నుకునేందుకా అన్నట్టు పార్టీ వర్కింగ్ కమిటీ శనివారం సమావేశమైంది. సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ ని ఈ పదవికి ఎన్నుకోవచ్ఛునని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికను ప్రస్తుతానికి చేపట్టరాదని ఈ సమావేశంలో నిర్ణయించారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు హాజరైన ఈ మీటింగ్..నూతన […]

అధ్యక్షుని ఎన్నిక ఇప్పుడే కాదు.. కాంగ్రెస్ లో ఇక జోనల్ కమిటీలు..
Anil kumar poka
| Edited By: |

Updated on: Aug 10, 2019 | 3:13 PM

Share

కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుని ఎన్నికపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిజానికి పార్టీకి నూతన ప్రెసిడెంటును ఎన్నుకునేందుకా అన్నట్టు పార్టీ వర్కింగ్ కమిటీ శనివారం సమావేశమైంది. సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ ని ఈ పదవికి ఎన్నుకోవచ్ఛునని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికను ప్రస్తుతానికి చేపట్టరాదని ఈ సమావేశంలో నిర్ణయించారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు హాజరైన ఈ మీటింగ్..నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే బదులు జోనల్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సిఎల్ఫీనేతలని అయిదు గ్రూపులుగా విభజించి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని తీర్మానించారు. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాల నేతలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఉత్తరాది రాష్ట్రాల వారితో ప్రియాంక గాంధీ, పశ్చిమ రాష్ట్రాల వారితో రాహుల్ గాంధీ, తూర్పు రాష్ట్రాల వారితో సోనియా, ఈశాన్య రాష్ట్రాల వారితో అంబికా సోని సంప్రదింపులు జరుపుతారు. కేవలం వర్కింగ్ కమిటీ నాయకులతోనే కాకుండా ఆయా రాష్ట్రాల నేతలతోనూ చర్చలు జరిపి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్న రాహుల్ సూచన మేరకు ఈ జోనల్ కమిటీలను ఏర్పాటు చేయడం విశేషం. దీంతో నూతన బాస్ ని ఎన్నుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్ఛునని భావిస్తున్నారు.

అటు-కొత్త ప్రెసిడెంట్ ఎన్నికలో తాము భాగస్వామ్యం వహించే ప్రసక్తి లేదని సోనియా, రాహుల్ స్పష్టం చేశారు. వారు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఫలితంగా ఇక ఈ బాధ్యత పార్టీ ప్రెసిడెంట్లు, ఇతర ముఖ్య నేతలపై పడింది.కీలకమైన సోనియా, రాహుల్ వంటివారు అంటీముట్టనట్టు ఇలా అతి ముఖ్యమైన సమావేశం నుంచి బయటకి వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇన్నేళ్ల చరిత్ర గల పార్టీ కేవలం కొత్త అధ్యక్షుని ఎన్నిక మీద ఇప్పటికీ ఇలా మల్లగుల్లాలు పడడం అంతు చిక్కడంలేదు. అటు- అధ్యక్షుని ఎన్నిక కోసం నామినేషన్ పధ్దతిని ప్రవేశపెట్టాలా అని కూడా పార్టీ యోచిస్తున్నట్టు సమాచారం.

Follow Us
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
యుద్ధంతో 10 మంది ధనిక భారతీయ వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం
యుద్ధంతో 10 మంది ధనిక భారతీయ వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం
ఇరాన్ ప్రతికార దాడులు.. CBSE 10, 12 తరగతుల పరీక్షలు మళ్లీ వాయిదా!
ఇరాన్ ప్రతికార దాడులు.. CBSE 10, 12 తరగతుల పరీక్షలు మళ్లీ వాయిదా!
సర్కార్ బడిలో వికసించిన ‘గునుగుపూలు’ పరిమళం..!
సర్కార్ బడిలో వికసించిన ‘గునుగుపూలు’ పరిమళం..!
మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..?
మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..?