నాలుగు నెలల్లో ‘రామ్ మందిర్’ నిర్మాణం ప్రారంభం: అమిత్ షా

నాలుగు నెలల్లో “ఆకాశాన్ని తాకేంత” గొప్పగా రామ్ మందిర్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. “నవంబర్ 9న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇప్పుడు నాలుగు నెలల్లోనే రామ్ ఆలయం అయోధ్యలో ప్రారంభమవుతుంది” అని జార్ఖండ్ లోని పాకూర్ లో జరిగిన ర్యాలీలో అమిత్ షా తెలిపారు. కోర్టులలో కేసువేసి రామ్ ఆలయాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్, “దేశాన్ని […]

నాలుగు నెలల్లో 'రామ్ మందిర్’ నిర్మాణం ప్రారంభం: అమిత్ షా
Follow us

| Edited By:

Updated on: Dec 17, 2019 | 2:14 PM

నాలుగు నెలల్లో “ఆకాశాన్ని తాకేంత” గొప్పగా రామ్ మందిర్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. “నవంబర్ 9న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇప్పుడు నాలుగు నెలల్లోనే రామ్ ఆలయం అయోధ్యలో ప్రారంభమవుతుంది” అని జార్ఖండ్ లోని పాకూర్ లో జరిగిన ర్యాలీలో అమిత్ షా తెలిపారు. కోర్టులలో కేసువేసి రామ్ ఆలయాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్, “దేశాన్ని సురక్షితంగా ఉంచలేదు, పౌరుల భావోద్వేగాలను గౌరవించలేదు” అని ఆయన ఆరోపించారు.

అయోధ్యలో రామ్ జన్మభూమి న్యాస్ చీఫ్ మహాంత్ నృత్య గోపాల్ దాస్ మాట్లాడుతూ, “ఇంతకంటే మనకు సంతోషకరమైనది మరొకటి ఉండదు. ఆలయ నిర్మాణానికి ఒక కాలపరిమితి నిర్ణయించినందుకు మేము సంతోషంగా ఉన్నాము” అని అన్నారు. రామ్ ఆలయ నిర్మాణం వచ్చే ఏడాది రామ్ నవమికి లాంఛనంగా ప్రారంభమవుతుందని ఇతర సాధువులు ఇంతకు ముందే చెప్పారు.