AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆధిక్యంలో ఎన్డీఏ… దూసుకెళ్తున్న బుల్

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ లీడింగ్‌లో ఉండటంతో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్‌లో ఎన్‌డీఏ డబుల్ సెంచరీ దాటెయ్యడం, అందులో బీజేపీనే 200 పైగా సీట్ల ఆధిక్యంలో ఉండటంతో స్టాక్ మార్కెట్లు భారీగా లాభాపడ్డాయి. ఓపెనింగ్‌లోనే సెన్సెక్స్ 539.05 పైగా పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 156 పైగా పాయింట్లు దూసుకెళ్లింది. సరిగ్గా ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్లలో ఎన్డీఏ ఆధిక్యం కనబర్చింది. పోస్టల్ […]

ఆధిక్యంలో ఎన్డీఏ... దూసుకెళ్తున్న బుల్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 23, 2019 | 11:19 AM

Share

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ లీడింగ్‌లో ఉండటంతో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్‌లో ఎన్‌డీఏ డబుల్ సెంచరీ దాటెయ్యడం, అందులో బీజేపీనే 200 పైగా సీట్ల ఆధిక్యంలో ఉండటంతో స్టాక్ మార్కెట్లు భారీగా లాభాపడ్డాయి. ఓపెనింగ్‌లోనే సెన్సెక్స్ 539.05 పైగా పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 156 పైగా పాయింట్లు దూసుకెళ్లింది.

సరిగ్గా ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్లలో ఎన్డీఏ ఆధిక్యం కనబర్చింది. పోస్టల్ బ్యాలెట్‌లో ఎన్డీఏ దూసుకెళ్తుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. స్టాక్ మార్కెట్ ప్రారంభమయ్యే సమయానికి ఎన్డీఏ 250 పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 200 పైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. దీంతో ఉదయం 9.15 గంటలకు స్టాక్ మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్, నిఫ్టీ దూసుకెళ్లాయి. నిఫ్టీ ఈ రోజు 12,000 మార్క్‌ను దాటొచ్చని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు.

కాగా, ఎగ్జిట్ ఫలితాల రోజున ఎన్డీఏకు స్పష్టమైన ఆధిక్యం రావడంతో మరుసటి రోజు స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లు, నిఫ్టీ 421 పాయింట్లు దూసుకెళ్లాయి. మళ్లీ మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలకే ఆవిధంగా దూకుడు చూపిన ఇన్వెస్టర్లు, ఇప్పుడు కౌంటింగ్‌లో ఎన్డీఏ లీడింగ్‌లో ఉండటంతో అంతే దూకుడు చూపించారు. మరోవైపు రూపాయి విలువ కూడా బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 21 పైసలు బలపడింది. గురువారం 69.66 దగ్గర ముగిసిన రూపాయి ప్రస్తుతం 69.45 దగ్గర కొనసాగుతోంది.

ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు