రైతును మోసం చేసిన విత్తన సంస్థకు ఫైన్.. రూ.2.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం

నష్టపోవడం రైతులకు, ముంచెయ్యడం కొన్ని విత్తన కంపెనీలకు అలవాటు అయ్యిపోయింది. అన్నదాతలు ఎన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేసినా, ఆందోళనలు చేసినా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.

రైతును మోసం చేసిన విత్తన సంస్థకు ఫైన్.. రూ.2.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం
Follow us

|

Updated on: Nov 13, 2020 | 6:18 PM

నష్టపోవడం రైతులకు, ముంచెయ్యడం కొన్ని విత్తన కంపెనీలకు అలవాటు అయ్యిపోయింది. అన్నదాతలు ఎన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేసినా, ఆందోళనలు చేసినా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. కానీ తాజాగా అనంతపురం జిల్లా పామిడి మండలానికి చెందిన లక్ష్మీనారాయణరెడ్డి అనే రైతుకు వినియోగదారుల కమిషన్ న్యాయం చేసింది. వివరాల్లోకి వెళ్తే…మణికంఠ ఆగ్రో ఏజెన్సీస్‌లో రూ.6,880తో పత్తి విత్తనాలను కొని రెండున్నర ఎకరాల్లో సాగు చేశారు లక్ష్మీనారాయణరెడ్డి. పంట ఎంతకీ రాకపోవడంతో వ్యవసాయాధికారులకు సమాచారమిచ్చారు. విత్తనాలిచ్చిన షాపు ఓనర్ వద్దకు వెళ్లి నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు.

ఆ తర్వాత ఆయనకు, ముంబయికి చెందిన విత్తన తయారీదారు, అనంతపురానికి చెందిన డిస్ట్రిబ్యూటరుకులీగల్‌ నోటీసులిచ్చారు. అయితే వారు అనంతపురం జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. తామిచ్చిన సూచనలను రైతు పాటించనందునే పంట నష్టం వాటిల్లిందని విత్తన తయారీ సంస్థ కౌంటరు వేసింది. 2017లో జిల్లా కమిషన్‌ ఇరు వర్గాల వాదనలను విని విత్తన సంస్థ తరఫున సేవాలోపం ఉందని గుర్తించింది. విత్తన సంస్థ, సరఫరాదారు, డీలరు కలిసి పంట నష్టానికిగానూ రైతుకు రూ.2.5 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చింది. తీర్పును  విత్తన సంస్థ సవాల్ చేస్తూ రాష్ట్ర కమిషన్‌ను ఆశ్రయించింది. జిల్లా కమిషన్‌ నిర్ణయాన్నే సమర్థిస్తూ రాష్ట్ర కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ టి.సునీల్‌ చౌదరి, మెంబర్ పి.ముత్యాల నాయుడు తీర్పునిచ్చారు.

అయితే అన్నీ ఆధారాలు ఉండబట్టి ఇన్నేళ్ల  తర్వాత న్యాయం జరిగింది. అవే లేకపోతే పరిస్థితి వేరే ఉండేది. అసలు తాము మోసపోయామని వినియోగదారులు కమిషన్ ఆశ్రయించే రైతులు ఎంతమంది ఉంటారు చెప్పండి. అందుకే నకిలీ విత్తన సంస్థలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. అన్నదాతలను మోసం చెయ్యాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

Also Read :

ప్రాణాలు తీసిన కల్తీ మద్యం, ముగ్గురు దుర్మరణం, మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం

ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు బాగున్నాయి, చలి కాలంలో అప్రమత్తత అవసరం : కోటి కమాండ్ సెంటర్ డీహెచ్

తెలుగు ప్రజలకు సీఎంల దీపావళి శుభాకాంక్షలు, ప్రజల జీవితాల్లో పండుగ వెలుగులు నింపాలని ఆకాంక్ష

ఆ ఇద్దరు లెజెండ్‌లు కలిస్తే రోహిత్.. ముంబై సారథిపై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!