సత్యమే గెలిచిందంటూ యోగి ఆదిత్యనాథ్ ట్వీట్

|

Sep 30, 2020 | 3:08 PM

బాబ్రీ మసీదు కూల్చివేతలో కుట్ర కోణం లేదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు

సత్యమే గెలిచిందంటూ యోగి ఆదిత్యనాథ్ ట్వీట్
Follow us on

బాబ్రీ మసీదు కూల్చివేత తుది తీర్పుపై భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. బాబ్రీ మసీదు కూల్చివేతలో కుట్ర కోణం లేదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు. ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, రాజకీయ పక్షపాతంతో బీజేపీ నేతలపై, సాధువులు, సంతులపై, వీహెచ్‌పీ నేతలపై కాంగ్రెస్ తప్పుడు కేసులు పెటిందని సీఎం యోగి ఆరోపించారు. వారి పరువు తీయడానికి ప్రయత్నించింది. కుట్రలో పాల్గొన్న వారు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ సీఎం యోగి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.

ఇక, సీబీఐ కోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోలీసులు మోహ‌రించారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.