AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరికొన్నేళ్లలో ముంబై నగరం మునిగిపోనుందా..?

త్వరలోనే దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం మునిగిపోనుందా..?. నిత్యం పెరుగుతోన్న సముద్రమట్టాల ప్రభావం మహానగరానికి పెను ముప్పు తీసుకురాబోతుందా..?. అవును తాజాగా ఓ సంస్థ చేసిన అధ్యయనం అటువంటి డేంజర్ బెల్స్‌నే మోగిస్తుంది.  2050 క‌ల్లా ముంబై తీర ప్రాంతం అంతా నీట మున‌గ‌నున్న‌ట్లు చెప్పింది. ఈ ముప్పు కోల్‌కతాకు కూడా ఉన్నట్లు సర్వే తేల్చింది.  పెరుగుతున్న సముద్ర మట్టాలపై క్లైమేట్ సెంట్రల్​కు చెందిన స్కాట్ ఏ కల్ప్​, బెంజమిన్ హెచ్​ స్ట్రాస్ చేసిన పరిశోధనలో […]

మరికొన్నేళ్లలో ముంబై నగరం మునిగిపోనుందా..?
Ram Naramaneni
|

Updated on: Oct 31, 2019 | 3:24 AM

Share

త్వరలోనే దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం మునిగిపోనుందా..?. నిత్యం పెరుగుతోన్న సముద్రమట్టాల ప్రభావం మహానగరానికి పెను ముప్పు తీసుకురాబోతుందా..?. అవును తాజాగా ఓ సంస్థ చేసిన అధ్యయనం అటువంటి డేంజర్ బెల్స్‌నే మోగిస్తుంది.  2050 క‌ల్లా ముంబై తీర ప్రాంతం అంతా నీట మున‌గ‌నున్న‌ట్లు చెప్పింది. ఈ ముప్పు కోల్‌కతాకు కూడా ఉన్నట్లు సర్వే తేల్చింది.  పెరుగుతున్న సముద్ర మట్టాలపై క్లైమేట్ సెంట్రల్​కు చెందిన స్కాట్ ఏ కల్ప్​, బెంజమిన్ హెచ్​ స్ట్రాస్ చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ముందుగా అంచ‌నా వేసిన దాని క‌న్నా.. ప‌రిస్థితులు మ‌రింత భ‌యాన‌కంగా ఉండ‌నున్నట్లు ఆ సంస్థ అధ్యయనంలో తేలింది.

ప్రతి ఏడాదికి పెరిగిపోతున్న వరదల తాకిడికి  సౌత్ ముంబైలోని చాలా వరకు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని రిపోర్ట్ తేల్చింది.  వాతావ‌ర‌ణ మార్పుల‌ను అవగాహన చేసుకోకుంటే…భారత్​ సహా చాలా వరకు ఆసియా దేశాలలోని హై టైడ్ లైన్(వార్షిక వరదల కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలు) పరిధిలో నివసించే జనాభా కూడా ఇప్పటితో పోల్చుకుంటే ఐదు నుంచి పది రెట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 2050 నాటికి 34 కోట్ల మంది హై టైడ్ లైన్ ప్రజలు  నివాసం ఉంటారని.. ఈ శతాబ్దం చివరినాటికి ఆ సంఖ్య 63 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. న్యూ జెర్సీకి చెందిన ఆ సంస్థ త‌న నేచ‌ర్ క‌మ్యూనికేష‌న్స్ జ‌ర్న‌ల్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

వరల్డ్‌వైడ్‌గా.. ప్రస్తుతం 25 కోట్ల మంది వరదల కారణంగా సముద్ర గర్భంలో కలిసిపోయే ప్రాంతాలలో నివసిస్తున్నారని పరిశోధన తెలిపింది. భీక‌ర వ‌ర‌ద‌ల వ‌ల్ల‌ ప్రమాదం బారిన పడే ప్రాంతాల్లోని 70 శాతం మంది ప్రజలు చైనా, బంగ్లాదేశ్, భారత్, వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్​, జపాన్​ దేశాలలోనే ఉంటున్నట్లు స్టడీ అంచనా వేసింది.

Follow Us
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..