AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంక్ ఖాతాదారులకు ఆర్‌బీఐ తీపికబుర్లు!

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంక్ ఖాతాదారుకుల ఒకే రోజు మూడు తీపికబుర్లు అందించింది. ఒకటేమో వడ్డీ రేట్ల తగ్గింపు. ఆర్థిక వృద్ధి పరుగులు పెట్టించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మరొకటేమో నెఫ్ట్/ఆర్‌టీజీఎస్ చార్జీల ఎత్తివేత. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మూడోదేమో ఏటీఎం చార్జీలు, ఫీజులకు సంబంధించి ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు. ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్ (ఏటీఎం) చార్జీలు, ఫీజులకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ఆర్‌బీఐ జూన్ 6న […]

బ్యాంక్ ఖాతాదారులకు ఆర్‌బీఐ తీపికబుర్లు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 06, 2019 | 6:19 PM

Share

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంక్ ఖాతాదారుకుల ఒకే రోజు మూడు తీపికబుర్లు అందించింది. ఒకటేమో వడ్డీ రేట్ల తగ్గింపు. ఆర్థిక వృద్ధి పరుగులు పెట్టించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మరొకటేమో నెఫ్ట్/ఆర్‌టీజీఎస్ చార్జీల ఎత్తివేత. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మూడోదేమో ఏటీఎం చార్జీలు, ఫీజులకు సంబంధించి ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు.

ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్ (ఏటీఎం) చార్జీలు, ఫీజులకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ఆర్‌బీఐ జూన్ 6న ప్రకటించింది. దీంతో రానున్న రోజుల్లో ఏటీఎం చార్జీలు దిగిరావొచ్చు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సీఈవో ఈ కమిటీకి హెడ్‌గా వ్యవహరిస్తారు.

ఏటీఎం పరిశ్రమ సమాఖ్య (సీఏటీఎంఐ) 2018 జూన్ నెలలోనే ఏటీఎం చార్జీల విషయంలో జోక్యం చేసుకోవాలని ఆర్‌బీఐని కోరింది. ఇకపోతే కొత్తగా ఏర్పాటు కానున్న కమిటీ తన తొలి మీటింగ్ తర్వాత రెండు నెలలలోగా ప్రతిపాదనలను అందజేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. పాలసీ సమీక్ష తర్వాత ఆర్‌బీఐ ఈ నిర్ణయాలు వెల్లడించింది.