మళ్లీ ‘ఉఫ్’మనిపించిన రజనీ

| Edited By: Srinu

Mar 07, 2019 | 7:53 PM

చెన్నై: తన అభిమానులు మరోసారి ‘ఉఫ్’ అనేలా ప్రకటన చేశారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఏడాది క్రితం రాజకీయాల్లోకి ప్రవేశించిన రజనీ.. రజనీ మక్కల్ మంద్రమ్ అనే వేదికను ఏర్పాటు చేసి మద్దతుదారులు, అభిమానులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రజనీ పోటీ చేస్తారని వారందరూ అనుకున్నారు. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు రజనీ. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో నేను పోటీ చేయడం […]

మళ్లీ ‘ఉఫ్’మనిపించిన రజనీ
Follow us on

చెన్నై: తన అభిమానులు మరోసారి ‘ఉఫ్’ అనేలా ప్రకటన చేశారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఏడాది క్రితం రాజకీయాల్లోకి ప్రవేశించిన రజనీ.. రజనీ మక్కల్ మంద్రమ్ అనే వేదికను ఏర్పాటు చేసి మద్దతుదారులు, అభిమానులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రజనీ పోటీ చేస్తారని వారందరూ అనుకున్నారు. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు రజనీ. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. మన లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలే’’ అంటూ రజనీ ప్రకటించారు.

తాను ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదు. ప్రచార సమయంలో నా ఫొటో గానీ, సంస్థ జెండాను గానీ ఎవరూ వాడొద్దు. తమిళనాడు నీటి సంక్షోభాన్ని ఏ పార్టీ శాశ్వతంగా పరిష్కరిస్తుందని భావిస్తున్నారో దానికే ఓటు వేయండి అంటూ రజనీ కాంత్ తెలిపారు. ఆదివారం జిల్లా కార్యదర్శులతో జరిగిన కార్యక్రమంలో రజనీకాంత్ ఈ మేరకు చెప్పారు. 2020 ఆగష్టు నెలలో పార్టీని ఏర్పాటుచేద్దామని, ఆ తరువాత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకుంటామని రజనీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనని రజనీ చెప్పడంపై అభిమానులు కాస్త అసంతృప్తికి లోనైనట్లు సమాచారం.